ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలుపాతబస్తీకి కొత్త నగిషీలు.. భాగ్యనగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ఒక్కో అడుగు ముందుకు పడుతోంది. ఇప్పటికే ఈ మహానగరానికి ఎన్నో సరికొత్త హంగులు రూపుదిద్దుకున్నాయి. హైదరాబాద్ నగరాన్ని ప్రగతి పథంలో పరుగులు పెట్టించేందుకు ఎన్నో అభివృద్ధి పనులకు స్వయంగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నాంది పలుకుతున్నారు.బీజాపూర్లో మావోయిస్టుల బీభత్సం..ఛత్తీస్గఢ్ భీజాపూర్లో మావోయిస్టులు బీభత్సం సృష్టించారు. శివశక్తి కంపెనీకి చెందిన 9 వాహనాలను తగులబెట్టారు. ఇందులో 7 టిప్పర్లు, 2 జేసీబీలు పూర్తిగా కాలిపోయాయి.పాత సైకిల్తో నయా మోటార్ బైక్ రఘువరణ్ బీటెక్ సినిమా చూశారు కదా. అందులో హీరో వద్ద ఓ బైక్ ఉంటుంది. అది పెట్రోల్ లేకుండా కూడా నడుస్తుంది. ఇటు సైకిల్గా... అటు బైక్గా రెండు రకాలుగా పనిచేస్తుంది. అచ్చం అలాంటి బైక్నే తయారు చేశాడు హైదరాబాద్కు చెందిన ఓ యువకుడు.రైతే రా'రాజు'పదో తరగతి చదివిన ఆ రైతు.. సాగులో మాత్రం చాలా పెద్ద పండితుడు. వినూత్న పద్ధతులు.. ఆధునిక సాంగేతికత వినియోగంతో సాగులో లాభాల బాట పడుతున్నాడు. 500 రకాల దేశవాళీ వరి వంగడాలను సంరక్షిస్తూ.. సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాడు. నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు క్రిప్టో కరెన్సీ వినియోగంపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఉగ్రవాద నిధులకు ఉపయోగించే ముప్ప పొంచి ఉందన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా ఓ సెమినార్లో మాట్లాడారు.పురుషులు కూర్చోవద్దు.. ఆర్ఎస్ఎస్ కార్యకర్త హత్య కేసు నేపథ్యంలో జిల్లాలో కీలక ఆదేశాలు జారీ చేశారు కేరళలోని పాలక్కడ్ ఎడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్. జిల్లాలో ద్విచక్రవాహనంపై వెనుక సీటులో పురుషులు ప్రయాణించడంపై నిషేధం విధించారు.అక్కడ లీటర్ పెట్రోల్ రూ.338 సంక్షోభంలో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న శ్రీలంక ప్రజలకు ఇంధన ధరలు గుదిబండలా మారాయి. లంక చమురు సంస్థ మరో రూ.84 పెంచడం వల్ల ఆ దేశంలో లీటర్ పెట్రోల్ ధర ఏకంగా రూ.338కి చేరింది. మరోవైపు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యాంగ సవరణ చేయాలని ప్రధాని మహింద రాజపక్స ప్రతిపాదించారు.జుట్టును పెంచే గింజలు...జుట్టుకు పైపైన ఎన్ని లేపనాలు పూసినా.. ఫలితం తక్కువే. పోషక విలువలున్న ఆహారానికి కొన్నిరకాల గింజలు జత చేసి తీసుకుంటేనే శిరోజాలు పెరుగుతాయంటున్నారు నిపుణులు...మాల్దీవుల్లో రాఖీభాయ్.. 'కేజీఎఫ్ 2' విజయోత్సాహంలో కుటుంబంతో కలిసి మాల్దీవులకు వెళ్లారు కన్నడ రాకింగ్ స్టార్ యశ్. దీనికి సంబంధించిన ఫొటో నెట్టింట్లో వైరల్గా మారగా.. దీన్ని చూసిన అభిమానులు లైక్స్, కామెంట్స్తో సోషల్మీడియాను హోరెత్తిస్తున్నారు. ఫించ్తో మాటల యుద్ధంఐపీఎల్లో కోల్కతా ఓపెనర్ ఆరోన్ ఫించ్తో మాటల యుద్ధానికి దిగాడు రాజస్థాన్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ. దీంతో అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.