తెలంగాణ

telangana

By

Published : Dec 30, 2021, 6:59 AM IST

ETV Bharat / city

TOP NEWS: టాప్​న్యూస్​@ 7AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP NEWS
TOP NEWS

  • ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ పూర్తి!

TS New zonal system : వైద్య, ఆరోగ్య శాఖ మినహా జోనల్ కేడర్ ఉద్యోగుల కేటాయింపుల ప్రక్రియ పూర్తయింది. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే అప్పీల్ చేసుకోవచ్చు.

  • దళితబంధు అమలుకు కసరత్తు..

Dalit bandhu implementation : రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు అమలుకు సర్కారు సమాయత్తమవుతోంది. నియోజకవర్గానికి 100 కుటుంబాల చొప్పున ఎంపిక చేసి, ఒక్కొక్కరికి 10 లక్షల విలువైన యూనిట్లు మంజూరు చేయనుంది. మార్చి నాటికి యూనిట్లు ఏర్పాటయ్యేలా త్వరలో నిధులు విడుదల చేయనున్నట్లు తెలిసింది.

  • న్యూ ఇయర్​ వేడుకలు సిద్ధమవుతున్నారా..? అయితే...

new year celebrations Guidelines : నూతన సంవత్సర వేడుకలపై హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసులు ఆంక్షలు విధించారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వేడుకలు నిర్వహించే వారితో పాటు పాల్గొనే వారు కొవిడ్‌ జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేశారు.

  • జనవరి నుంచి వీటి ధరలు పెరుగుతాయి..!

gst rules changes : వచ్చే ఏడాది వస్తు సేవల పన్నులో పలు మార్పులు రానున్నాయి. కొన్ని వస్తువులపై సవరించిన రేట్లు జనవరి 1 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. దీంతో ఆయా వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇక జీఎస్టీ రిటర్నుల దాఖలుకు సంబంధించిన ప్రక్రియలో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. వీటన్నింటినీ కొత్త సంవత్సరం నుంచి అమలు చేయనున్నారు.

  • రికార్డు ధర పలుకుతోన్న తెల్ల బంగారం..

Cotton Price in Telangana: పత్తికి మార్కెట్లలో రికార్డు స్థాయి ధర పలుకుతోంది. వరంగల్ ఎనుమాముల మార్కెట్లో క్వింటా పత్తి అత్యధికంగా రూ.8,800కు చేరితే... పరకాల, కేసముద్రం మార్కెట్లలో రూ.8,900 పలకటం విశేషం. పత్తికి మంచి ధర రావడంపై అన్నదాతలు ఒకింత హర్షం వ్యక్తం చేస్తున్నా.. వర్షాల కారణంగా దిగుబడి భారీగా తగ్గిపోవడాన్ని తలచుకొని బాధపడుతున్నారు.

  • 'బూస్టర్​ డోసుగా ఆ వ్యాక్సిన్​ ఉత్తమం'

Booster Dose Covishield: ఒమిక్రాన్​ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం ఇటీవల బూస్టర్​ డోసుకు ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో కొవిషీల్డ్​ తీసుకున్న వారికి బూస్టర్​ డోసుగా కొవావాక్సే సరైనది సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

  • 'ప్రైవేటీకరణ.. రిజర్వేషన్లను అంతం చేసే మార్గం'

Priyanka Gandhi On Privatisation: ప్రైవేటీకరణతో దేశంలో రిజర్వేషన్లను అంతం చేయాలని మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు. మహిళా శక్తి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

  • యూజర్లకు యూట్యూబ్‌ భారీ షాక్‌..

Youtube Offline Video Download: మునుపటిలా యూట్యూబ్​లో వీడియోలను డౌన్​లోడ్ చేసుకోవడం కుదరదు. ఒకవేళ మీరు అలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే యూట్యూబ్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాలి. అంటే నెలనెలా డబ్బులు కట్టాలన్నమాట!

  • బుమ్రా సరికొత్త రికార్డు

Bumrah record: భారత్ తరఫున అద్భుతంగా రాణిస్తున్న పేసర్ బుమ్రా.. టెస్టుల్లో సరికొత్త ఘనత సాధించాడు. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే?

  • ఇప్పటికీ అలా చేయాలంటే సిగ్గు

తన దగ్గరకు వచ్చిన ప్రతి కథను రియలిస్టిక్​గా తీసేందుకు ప్రయత్నిస్తానని అన్నారు హీరో శ్రీ విష్ణు. అదే తన బలమని చెప్పారు. ఆయన నటించిన 'అర్జున ఫల్గుణ'.. డిసెంబర్ 31న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో సినిమా సహా వ్యక్తిగతం జీవితం గురించి ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details