ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలురైతులకు శుభవార్త.. రైతులకు కేంద్రం శుభవార్త అందించింది. గోధుమ, కందులు, ఆవాలకు కనీస మద్దతు ధరను పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.తెరాస పిటిషన్ కొట్టివేత..మునుగోడు ఉపఎన్నికలో కారును పోలిన 8 గుర్తులను తొలగించాలని తెరాస వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నందున ప్రస్తుతం జ్యోకం చేసుకోలేమని ధర్మాసనం తెలిపింది.తండ్రీకుమారుల హత్య కేసును ఛేదించిన పోలీసులు.. Uppal Father and Son Murder Case Update: హైదరాబాద్ ఉప్పల్లో ఉలిక్కిపాటుకు గురిచేసిన జంట హత్యల మిస్టరీని పోలీసులు ఛేదించారు. జ్యోతిష్యుడు చెప్పిన పూజలు ఫలించలేదని ఓ యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు. తండ్రీకుమారుడిని హత్య చేసిన ప్రధాన నిందితుడితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. హత్యోదంతంపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు.ఎంత అద్భుతంగా ఉందో..నిజాం కాలంలో నిర్మించిన పురాతన మెట్ల బావులు అవి.. ఈ నీటితోనే నగర ప్రజలు తాగునీటి, రోజువారి అలవాట్లకు నీటిని తీసుకొని వినియోగించుకునేవారు.. ఇది నాటి చరిత్ర. కానీ నేడు ఈ మెట్ల బావులు ఎందుకు పనికిరానివిగా చెత్తా చెదారంతో నిండిపోయాయి. మంత్రి రోజా ఆడియో వైరల్.. నగరిలో వైకాపాలో వర్గపోరు మరోసారి బహిర్గతమైంది. పార్టీలో అంతర్గత పోరుపై మంత్రి రోజా ఆడియో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ ఆడియోలో ఏముందంటే?కశ్మీర్లో ఉగ్రదాడి..జమ్ము కశ్మీర్లో హైబ్రిడ్ ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు యూపీ కూలీలు మరణించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు.అయోధ్య రామమందిరం కూల్చివేతకు కుట్ర.. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) కుట్రలను మహారాష్ట్ర ఏటీఎస్ బయటపెట్టింది. అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరాన్ని ధ్వంసం చేయాలని పీఎఫ్ఐ ప్లాన్ చేసినట్లు దర్యాప్తులో తేల్చింది. కోర్టు వద్దన్నా విడుదల..సంచలనం రేపిన బిల్కిస్ బానో అత్యాచార దోషుల విడుదలపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సత్ప్రవర్తన కారణంగానే 11 మందిని విడుదల చేశామని సుప్రీం కోర్టులో గుజరాత్ సర్కార్ అఫిడవిట్ దాఖలు చేసింది.బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ.. బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా టీమ్ ఇండియా మాజీ బౌలర్ రోజర్ బిన్నీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఈ మేరకు మంగళవారం జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.ఛాన్స్ కొట్టేసిన దీపికా పదుకొణె!దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి మరో సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. ప్రముఖ కథానాయకుడు మహేశ్ బాబుతో యాక్షన్ అడ్వెంచర్ నేపథ్యంలో సాగే కథతో సినిమా చేస్తున్నారు.