తెలంగాణ

telangana

By

Published : Aug 6, 2020, 7:27 PM IST

ETV Bharat / city

ఆచార్య జయశంకర్​పై తెలంగాణ జాగృతి ప్రత్యేక గీతం

ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా తెలంగాణ జాగృతి ప్రత్యేక గీతాన్ని రూపొందించింది. ఈ పాటను మాజీ ఎంపీ, జాగృతి అధ్యక్షురాలు కవిత ఆవిష్కరించారు.

ఆచార్య జయశంకర్​పై తెలంగాణ జాగృతి ప్రత్యేక గీతం
ఆచార్య జయశంకర్​పై తెలంగాణ జాగృతి ప్రత్యేక గీతం

ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలను తెరాస నేతలు పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ జాగృతి రూపొందించిన ప్రత్యేక గీతాన్ని మాజీ ఎంపీ కవిత ఆమె నివాసంలో ఆవిష్కరించి ఆచార్య జయశంకర్​కు నివాళి అర్పించారు. తెలంగాణ భవన్ లో మంత్రులు సత్యవతి రాథోడ్, నిరంజన్ రెడ్డి జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రవీంద్రభారతిలో జయశంకర్ చిత్రపటానికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ నివాళులు అర్పించారు. పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు జయశంకర్​ను స్మరించుకున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details