తెలంగాణ

telangana

Jagan bail cancellation petition: జగన్ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై తీర్పు రిజర్వ్​

By

Published : Dec 27, 2021, 6:41 PM IST

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. అక్రమాస్తుల కేసులో జగన్‌ బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన సోమవారం మరోసారి వాదనలు విన్న తెలంగాణ ఉన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వులో ఉంచింది.

High court on Jagan bail cancellation petition. ts high court
జగన్ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై ముగిసిన వాదనలు..

Jagan bail cancellation petition: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్​ తరఫున న్యాయవాది వెంకటేశ్‌ వాదనలు వినిపించారు. సీఎం హోదాలో జగన్‌ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంలో జగన్‌కు నోటీసులు ఇవ్వాలని కోరారు. బెయిల్ రద్దు పిటిషన్‌పై వైఖరి ఏమిటని హైకోర్టు.. సీబీఐని ప్రశ్నించింది. సీబీఐ కోర్టు తీర్పు తర్వాత పరిస్థితిలో ఏమీ మార్పు లేదని సీబీఐ తరపు న్యాయవాది బదులిచ్చారు. ఇరువైపులా వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.

హైకోర్టులో రఘురామ పిటిషన్.. ఎందుకంటే..
MP Raghurama petition on Jagan bail cancellation: అక్రమాస్తుల కేసులో.. ఏపీ ముఖ్యమంత్రి జగన్​తో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి​ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ.. తెలంగాణ హైకోర్టులో వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ రద్దు చేయాలన్న రఘురామ పిటిషన్లను సీబీఐ కోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ.. ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సీబీఐ కోర్టు విధించిన షరతులు ఉల్లంఘించినందున జగన్, విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని పిటిషన్​లో పేర్కొన్నారు.

రఘురామ పిటిషన్లను కొట్టేసిన సీబీఐ కోర్టు..

CBI court on YS Jagan's bail cancellation petition: జగన్, విజయసాయిరెడ్డి సాక్షులను ప్రలోభ పెడుతున్నారని, విచారణ ప్రక్రియను జాప్యం చేస్తున్నారని సీబీఐ కోర్టులో రఘురామ వాదించారు. అయితే.. తాము ఎలాంటి షరతులూ ఉల్లంఘించలేదని.. వ్యక్తిగత ప్రచారం, రాజకీయ ప్రయోజనాల కోసమే రఘురామ పిటిషన్లు దాఖలు చేశారని జగన్, విజయ్ సాయిరెడ్డి సీబీఐ కోర్టులో వాదించారు. సీబీఐ మాత్రం ఏమీ వాదించకుండా.. పిటిషన్లలోని అంశాలపై చట్టప్రకారం విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. సుదీర్ఘ వాదనల అనంతరం.. రఘురామ పిటిషన్లను సీబీఐ కోర్డు కొట్టేసింది. అయితే.. సీబీఐ కోర్టు పలు అంశాలను పరిగణనలోకి తీసుకోలేదంటూ.. తెలంగాణ హైకోర్టులో రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఇరువైపులా వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. ఇవాళ తీర్పును రిజర్వు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీ చదవండి: Niranjan reddy on BJP And congress : 'కాంగ్రెస్‌ త్వరలోనే భాజపాలో విలీనం కావడం ఖాయం'

ABOUT THE AUTHOR

...view details