తెలంగాణ

telangana

By

Published : Oct 19, 2020, 5:55 PM IST

ETV Bharat / city

'ఊర చెరువు శిఖం భూమిలో రైతు వేదిక నిర్మాణంపై నివేదిక ఇవ్వండి'

నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి మండలం ఉట్లూరులో ఊర చెరువు శిఖం భూమిలో రైతు వేదిక నిర్మిస్తున్నారని ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్​ దాఖలైంది. ఈ మేరకు విచారణ జరిపిన న్యాయస్థానం ఘటనపై వ్యక్తిగత విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కలెక్టర్​ను ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్​ 5కు వాయిదా వేసింది.

telangana high court on utlur rythu vedika construction
'ఊర చెరువు శిఖం భూమిలో రైతు వేదిక నిర్మాణంపై నివేదిక ఇవ్వండి'

నిజామాబాద్​ జిల్లా ఉట్లూరులో ఊరచెరువు శిఖంలో అక్రమంగా నిర్మిస్తున్న రైతు వేదికను ఆపాలని కోరుతూ ఉట్లూరుకు చెందిన చిల్కూరు బాజన్న దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్​చౌహాన్, జస్టిస్​ బి. విజయ్​సేన్​రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.

అధికారులకు వినతిపత్రం సమర్పించినప్పటికీ స్పందించడం లేదని పిటిషనర్​ ధర్మాసనానికి పేర్కొన్నారు. వ్యక్తిగతంగా విచారణ జరపాలని నిజమాబాద్​ కలెక్టర్​ను హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ చెరువు శిఖంలో రైతు వేదిక నిర్మిస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే ఆపాలని పాలనాధికారికి స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను నవంబర్​ 5కు వాయిదా వేసింది.

ఇదీ చూడండి :జర్నలిస్టు కుమారుడి కిడ్నాప్​.. రూ. 45 లక్షలు డిమాండ్!

ABOUT THE AUTHOR

...view details