తెలంగాణ

telangana

By

Published : Nov 12, 2021, 9:33 AM IST

ETV Bharat / city

Minister Harish Rao: 'రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ వేగం పెంచండి'

తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్(Corona vaccination in Telangana) ప్రక్రియ వేగం పెంచాలని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు(Telangana health minister Harish Rao) అధికారులను ఆదేశించారు. వ్యాక్సినేషన్​పై ఈనెల 13న జిల్లా కలెక్టర్లు, వైద్యాధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.

Minister Harish Rao
Minister Harish Rao

రాష్ట్రంలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌(Corona vaccination in Telangana) ప్రక్రియ వేగం పెంచాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు(Telangana Health Minister Harish Rao) అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌లో వైద్యఆరోగ్య శాఖ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, టీకాలు, కొత్త వైద్య కళాశాలలు, మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు. వ్యాక్సినేషన్‌పై శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్యాధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో జాతీయ సగటును మించి వ్యాక్సినేషన్‌(Corona vaccination in Telangana) పూర్తయిందని మంత్రి హరీశ్(Telangana Health Minister Harish Rao) రావు చెప్పారు. బుధవారం నాటికి రాష్ట్రంలో 84.3 శాతం మందికి మొదటి డోస్‌, 38.5 శాతం మందికి రెండో డోస్‌ వేశారని చెప్పారు. జాతీయ స్థాయిలో ఇవి వరుసగా 79 శాతం, 37.5 శాతంగా ఉన్నాయని వివరించారు. అంతకుముందు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాన్‌సుఖ్‌ మాండవీయ(Union health minister Mansukh Mandaviya)తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు, వ్యాక్సినేషన్‌(Corona vaccination in Telangana) గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, సీఎంవో ఓఎస్డీ గంగాధర్‌, డీఎంఈ రమేష్‌రెడ్డి, కాళోజీ విశ్వవిద్యాలయం వీసీ కరుణాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు

  • కింగ్‌కోఠి దవాఖానాలో సాధారణ వైద్య సేవల పునరుద్ధరణ
  • టిమ్స్‌లో కొవిడ్‌కు కేటాయించిన 200 పడకలు మినహా సాధారణ వైద్య సేవలు ప్రారంభం
  • టిమ్స్‌ సిబ్బంది, ఆసుపత్రి బకాయిల చెల్లింపు

తెలంగాణలో నూరు శాతం కరోనా టీకాల పంపిణీ(Corona Vaccination in Telangana)కి రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ప్రణాళికలు రచిస్తోంది. జీహెచ్​ఎంసీ పరిధిలో ఇప్పటికే తొలిడోసు టీకా ప్రక్రియ 100 శాతం పూర్తయింది. పల్లెల్లోనూ అర్హులైన వారందిరికి 100 శాతం టీకాల పంపిణీ(Corona Vaccination in Telangana) అమలు చేసే విధంగా.. స్థానిక ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించడంపై దృష్టి పెట్టింది.

కొంత ఆలస్యమైనా, కచ్చితంగా టీకా రెండో డోసు(Corona second dose) తీసుకుంటేనే కొవిడ్‌ నుంచి రక్షణ లభిస్తుందని వైద్యశాఖ స్పష్టం చేస్తోంది. రెండో డోసు పొందని వారు రాష్ట్రంలో సుమారు 36.55 లక్షల మంది ఉండడంతో వీరిపై దృష్టి పెట్టింది. ఇందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని ఇటీవల కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశించడంతో.. రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ప్రజలకు రెండో డోసు ప్రాధాన్యాన్ని వివరించేందుకు గ్రామస్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details