తెలంగాణ

telangana

ETV Bharat / city

కొవిడ్ టీకాల పట్ల అపోహలు వద్దు: గవర్నర్​ - తెలంగాణ తాజా వార్తలు

కరోనా టీకాపై ప్రజలకు అపోహలు వద్దని గవర్నర్​ తమిళిసై సూచించారు. అర్హులందరూ కొవిడ్‌ టీకా వేయించుకోవాలన్నారు. టీకా విషయంలో రాజ్‌భవన్ సిబ్బంది ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.

కొవిడ్ టీకాల పట్ల అపోహలు వద్దు: గవర్నర్​
కొవిడ్ టీకాల పట్ల అపోహలు వద్దు: గవర్నర్​

By

Published : Mar 1, 2021, 7:12 PM IST

కొవిడ్​ నివారణ చర్యలను ప్రజలు యథావిధిగా పాటించాలని గవర్నర్​ తమిళిసై సూచించారు. కొవిడ్ టీకాల పట్ల అపోహలు వద్దని హితవు పలికారు. పుదుచ్చేరి నుంచి రాజ్‌భవన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్‌పై సమీక్షించారు.

అర్హులందరూ కొవిడ్‌ టీకా వేయించుకోవాలని గవర్నర్‌ తమిళిసై సూచించారు. టీకాలు తీసుకోవాలనుకొనే వారు యాప్‌లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. రాజ్‌భవన్‌లోనూ అర్హులైన వారు టీకా వేయించుకోవాలని తమిళిసై సూచించారు. టీకా విషయంలో రాజ్‌భవన్ సిబ్బంది ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.

ఇవీచూడండి:వ్యాక్సినేషన్‌ కేంద్రాలను గుర్తించేందుకు ప్రత్యేక 'మ్యాప్‌లు'

ABOUT THE AUTHOR

...view details