విద్యుత్ శాఖలో పని చేస్తున్నవారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సుమారు 400 మందికి పైగా ఎలక్టికల్ ఇంజినీర్లకు ప్రమోషన్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
రాష్ట్ర విద్యుత్ శాఖలో భారీగా పదోన్నతులు - విద్యుత్ శాఖలో పదోన్నతలు
రాష్ట్ర విద్యుత్ శాఖ ఉద్యోగులకు సర్కారు తీపికబురు చెప్పింది. 2009, 2010 బ్యాచ్కు చెందిన పలువురు ఇంజినీర్లకు పదోన్నతులు కల్పించినట్లు పేర్కొంది. సుమారు 400 మందికి ప్రమోషన్లు లభించినట్లు అధికారులు వెల్లడించారు.
![రాష్ట్ర విద్యుత్ శాఖలో భారీగా పదోన్నతులు Promotions in the power sector telangana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11808712-761-11808712-1621348335730.jpg)
తెలంగాణ విద్యుత్ శాఖలో ప్రమోషన్లు
పదోన్నతులు పొందిన వారిలో 2009 బ్యాచ్కు చెందిన 221మంది అసిస్టెంట్ ఇంజినీర్లు, 40 మంది అడిషనల్ అసిస్టెంట్ ఇంజినీర్లకు అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్లుగా పదోన్నతి ఇచ్చినట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ ప్రకటించింది. వీరితో పాటుగా 2010 బ్యాచ్కు చెందిన 131 మంది అసిస్టెంట్ ఇంజినీర్లు, 13 మంది అడిషనల్ అసిస్టెంట్ ఇంజినీర్లు పదోన్నతి పొందినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:సీఎం కేసీఆర్కు సన్మానం చేస్తా: జగ్గారెడ్డి