తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఆదివారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1,256 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్లో వెల్లడించింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం వైరస్ బాధితుల సంఖ్య 80,751కి చేరింది. మరోవైపు 10 మంది కొవిడ్తో మృతి చెందగా.. ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 637కు పెరిగింది. ఆదివారం 1,587 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22,528 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 389, రంగారెడ్డిలో 86, కరీంనగర్లో 73 కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో కొత్తగా 1,256 కరోనా కేసులు నమోదు - తెలంగాణ కరోనా బులెటిన్
![రాష్ట్రంలో కొత్తగా 1,256 కరోనా కేసులు నమోదు రాష్ట్రంలో కొత్తగా 1,256 కరోనా కేసులు నమోదు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8360856-868-8360856-1597032226197.jpg)
రాష్ట్రంలో కొత్తగా 1,256 కరోనా కేసులు నమోదు
09:01 August 10
రాష్ట్రంలో కొత్తగా 1,256 కరోనా కేసులు నమోదు
Last Updated : Aug 10, 2020, 9:41 AM IST