స్థానిక సంస్థల కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసే విషయంపై కాంగ్రెస్ పార్టీ (MLC elections Telangana congress 2021)తర్జనభర్జన పడుతోంది. పోటీ చేయాలా? ఎన్నికలకు దూరంగా ఉండాలా? అనే దానిపై స్పష్టమైన నిర్ణయానికి రాలేకపోతోంది.
దుబ్బాక, నాగార్జునసాగర్, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటముల ప్రభావం పార్టీపై పడిందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఓడిపోతే పార్టీ శ్రేణులు, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని సీనియర్ నాయకులు కొందరు ఇప్పటికే అభిప్రాయం వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరగనున్న (congress on mlc elections) జిల్లాలకు చెందిన సీనియర్ నాయకులు, డీసీసీ అధ్యక్షుల అభిప్రాయాలనూ సేకరించారు. నాలుగైదు రోజుల క్రితమే నిర్ణయం ప్రకటించాలని భావించినప్పటికీ.. ఎటూ తేల్చుకోలేక వాయిదా వేశారు.
తాజాగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి (tpcc chief revanth reddy news) అధ్యక్షతన శనివారం గాంధీభవన్లో సీనియర్ నేతల సమావేశం జరిగింది. పార్టీ నేతలు జగ్గారెడ్డి, మహేష్కుమార్గౌడ్, మధుయాస్కీగౌడ్, దామోదర రాజనర్సింహా, చిన్నారెడ్డి, వివిధ జిల్లాల అధ్యక్షులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల్లోని స్థానిక సంస్థలో పార్టీకి ఉన్న బలాబలాలను విశ్లేషించారు.
అనంతరం దామోదర రాజనర్సింహా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ఎన్నికల్లో పోటీచేయాలా? వద్దా? అనే విషయంపై ఇంకా కొంతమంది నాయకుల అభిప్రాయాలు తెలుసుకోవాల్సి ఉందని, అటు తర్వాత పీసీసీ నిర్ణయాన్ని ఏఐసీసీకి పంపిస్తామన్నారు. ధరణి, భూసమస్యల పరిశీలనకు దామోదర రాజనర్సింహా ఛైర్మన్గా, ఎం.కోదండరెడ్డి కన్వీనర్గా పీసీసీ కమిటీ ఏర్పాటుచేసినట్లు కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.