తెలంగాణ

telangana

ETV Bharat / city

'సహకార' ఎన్నికలు ప్రశాంతం.. ఫలితాల విడుదల - తెలంగాణ సహకార సంఘాల ఎన్నికలు

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. అన్నిచోట్లా ఫలితాలు ప్రకటించినట్లు సహకార శాఖ ప్రకటించింది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్లు పేర్కొంది.

telanagana pacs election
telanagana pacs election

By

Published : Feb 15, 2020, 7:39 PM IST

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల ప్రక్రియ పూర్తైంది. రాష్ట్రంలోని 906 పీఏసీఎస్​లకు గాను 904 పీఏసీఎస్​లకు ఎన్నికలు నిర్వహించారు. అందులో 157 సింగిల్ విండోల్లోని 2017 వార్డులన్నీ ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 747 పీఏసీఎస్​ల్లోని 3,388 వార్డులు కూడా ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 6,248 వార్డుల డైరెక్టర్ పదవుల కోసం ఇవాళ ఎన్నికలు జరిగాయి. ఈ స్థానాల్లో మొత్తం 14,530 మంది పోటీలో ఉన్నారు.

ఇవాళ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన పోలింగ్​లో 9,11,599 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. అన్ని చోట్లా ఓట్ల లెక్కింపు పూర్తి కావడంతో పాటు ఫలితాలను కూడా ప్రకటించారు. పీఏసీఎస్​ల పాలకమండళ్లకు నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్లు సహకార శాఖ ప్రకటించింది.

ఇదీ చూడండి:కేటీఆర్​ పీఏ పేరుతో రంజీ మాజీ క్రికెటర్​ మోసం.. అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details