ఏపీలో జరిగే బద్వేలు ఉపఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని ప్రధాన ప్రతిపక్షం తెదేపా నిర్ణయించింది. పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పొలిట్బ్యూరో అత్యవసర సమావేశంలో.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దివంగత ఎమ్మెల్యే సతీమణికే అధికార వైకాపా టికెట్ ఇవ్వటంతో.. ఎన్నికల్లో పోటీ చేయరాదని నిర్ణయించినట్లు తెదేపా తెలిపింది.
Badwel By-poll: బద్వేల్ ఉపఎన్నికలో పోటీపై తెదేపా స్పష్టత.. - కజప జిల్లా బద్వేల్ ఉపఎన్నిక వార్తలు
ఏపీలో జరిగే బద్వేలు ఉపఎన్నికలో పోటీపై తెదేపా స్పష్టత ఇచ్చింది. దివంగత ఎమ్మెల్యే సతీమణికే అధికార వైకాపా టికెట్ ఇవ్వటం వల్ల పోటీ చేయకూడదని నిర్ణయించింది.

tdp-withdraws-from-badwel-by-election
దివంగత ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య సతీమణి డాక్టర్ సుధాను.. బద్వేలు ఉపఎన్నికల అభ్యర్థిగా అధికార వైకాపా ఇప్పటికే ప్రకటించింది. తెదేపా తరఫున డాక్టర్ రాజశేఖర్ను గతంలోనే అభ్యర్థిగా ఖరారు చేశారు.ఇక భాజపా-జనసేన కూటమి తరఫున పోటీపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. నవతరం పార్టీ తరఫున ఇప్పటికే బద్వేలులో నామినేషన్ దాఖలైంది. వీళ్లు కూడా పోటీకి దూరంగా ఉంటే ఉపఎన్నిక ఏకగ్రీవం కానుంది. లేదంటే పోటీ జరిగే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: