తెలంగాణ

telangana

By

Published : Dec 23, 2020, 4:31 PM IST

ETV Bharat / city

పీవీకి భారతరత్న ఇవ్వాలి: ఎల్​.రమణ

దివంగత ప్రధాని పీవీ నరసింహరావుకు తెదేపా నేతలు నివాళులర్పించారు. 16వ వర్ధంతి సందర్భంగా... పీవీ ఘాట్‌లో ఆయన సమాధికి పుష్పాంజలి ఘటించారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని తెతెదేపా అధ్యక్షుడు ఎల్​.రమణ డిమాండ్​ చేశారు. ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

l ramana
l ramana

పీవీకి భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని తెతెదేపా అధ్యక్షుడు ఎల్​.రమణ డిమాండ్ చేశారు. పీవీ నరసింహారావుకు భారతరత్న ఇచ్చి గౌరవించాలని తెదేపా మొదటి నుంచి కోరుతోందని గుర్తు చేశారు. పీవీ 16వ వర్ధంతి సందర్భంగా నెక్లెస్​ రోడ్‌లోని పీవీ ఘాట్‌లో ఆయన సమాధికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.

పీవీ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన చేపట్టిన సంస్కరణలు, చేసిన పనులు, చూపిన బాట దేశానికి గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.

ఇదీ చదవండి :పీవీకు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నాం: ఉత్తమ్

ABOUT THE AUTHOR

...view details