తెలంగాణ

telangana

ETV Bharat / city

'మేము ఏం చేశామో చెబుతున్నాం.. మీరు ఏం చేశారో చెప్పగలరా?' - మేము ఏం చేశామో చెబుతున్నాం.. మీరు ఏం చేశారో చెప్పగలరా?

ఏపిలోని వైకాపా ప్రభుత్వంపై తెదేపా అధినేత చంద్రబాబు మరోసారి విమర్శలు సంధించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశామో చెబుతున్నామన్న ఆయన.. గత 14 నెలల్లో వైకాపా నేతలు ఏం చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు. ఏది మంచి.. ఏది చెడు అనేది ప్రజలు గ్రహించాలన్న ఆయన.. తమ హయాంలో అన్ని రంగాల్లోనూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని స్పష్టం చేశారు.

tdp-president-chandrababu-challanges-to-cm-jagan-on-development-projects
మేము ఏం చేశామో చెబుతున్నాం.. మీరు ఏం చేశారో చెప్పగలరా?

By

Published : Aug 10, 2020, 8:24 PM IST

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో అన్ని జిల్లా అభివృద్ధే లక్ష్యంగా తాము ముందుకెళ్లామని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. 13 జిల్లాల అభివృద్ధికి తామేం చేశామో చెబుతున్నామన్న ఆయన.. గత 14 నెలల్లో వైకాపా ప్రభుత్వం ఏ జిల్లాకు ఏం చేసిందో చెప్పగలరా అని ప్రశ్నించారు. సమగ్రాభివృద్ధికి తెదేపా నాంది పలికిందని అన్నారు. ఏది వాస్తవం, ఏది అవాస్తవం అనేది ప్రజలు గ్రహించాలని సూచించారు.

నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాం. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో రాష్ట్రాన్ని ప్రథమ స్థానానికి తీసుకొచ్చాం. జలవనరులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చాం. ఈపాటికి పూర్తికావాల్సిన పోలవరం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుందో అంతా గమనించాలి. అన్ని ప్రాంతాల్లోనూ పరిశ్రమల అభివృద్ధికి కృషి చేశాం. వరుసగా నాలుగేళ్లు రెండంకెల వృద్ధి సాధించిన రాష్ట్రంగా తీర్చిదిద్దాం. వ్యవసాయాన్ని ఆధునికీకరించి సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాం. రహదారులు, విద్యుత్ ఇలా అన్ని రంగాల్లో సమస్యలు అనతికాలంలోనే అధిగమించాం.

-చంద్రబాబు, తెదేపా అధినేత

ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు..

ప్రభుత్వం ప్రాజెక్టులు పూర్తి చేయకుండా కాలయాపన చేస్తోందని చంద్రబాబు విమర్శించారు. 17 నెలల్లో జలవనరులకు ఒక్క రూపాయి ఖర్చు చేయలేదన్న ఆయన.. నిధులు ఖర్చు చేయకుంటే పెండింగ్​ ప్రాజెక్టులు ఎలా పూర్తవుతాయని నిలదీశారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు తాము చాలా ప్రయత్నాలు చేశామన్న ఆయన... రాయలసీమ జిల్లాలను తయారీ రంగానికి, పారిశ్రామిక హబ్​గా అభివృద్ధి చేశామని పేర్కొన్నారు.

తమ హయాంలో విశాఖను ఆర్థిక రాజధానిగా తయారు చేసేందుకు శ్రీకారం చుట్టామన్నారు. స్మార్ట్​ సిటీగా విశాఖ అభివృద్ధికి ప్రణాళికలు రచించామని స్పష్టం చేశారు. తెదేపా అభివృద్ధి ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్లకుండా ఎదురుదాడి చేస్తారా..? అని చంద్రబాబు నిలదీశారు.

ఇదీ చూడండి:'రెండున్నర కోట్ల భూమిని 5లక్షలకే ఎలా ఇస్తారు..?'

ABOUT THE AUTHOR

...view details