TDP criticism on YCP Plenary: ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరిలో జరుతున్న వైకాపా ప్రీనరీపై తెదేపా నేతలు విమర్శలు గుప్పించారు. తన రాజకీయ అవసరాల కోసం తల్లిని, చెల్లిని వాడుకున్న సీఎం జగన్.. రాష్ట్ర ప్రజల్ని వంచిస్తున్నారని మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. మూడేళ్లలో చేసిందేమీ లేదు కాబట్టే విపక్షాల్ని తిట్టడానికి ప్లీనరీ పెట్టారని ఎద్దేవా చేశారు. గుంటూరులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
అమ్మను, చెల్లిని రాజకీయం కోసం వాడుకున్నారనేది యధార్థం. వాళ్ల చెల్లి పార్టీకి ఈయన మద్దతుందా లేదా? అంటే ప్రజలకు ఏం తెలియదనుకుంటున్నారా? అంటే ఈ పార్టీని ఆమె వ్యతిరేకిస్తోందా? ఎవరైనా ఏ మతమైనా ఆచరించొచ్చు. కానీ నువ్వు ఏ మతమో చెప్పు. తల్లిని, చెల్లికి బైబిల్ ఇచ్చి పంపుతావ్. ఈయనేమో గంగానదిలో మునుగుతాడు.- నక్కా ఆనంద్ బాబు, మాజీమంత్రి