తెలంగాణ

telangana

ETV Bharat / city

పల్లా శ్రీనివాస్‌ నిరాహార దీక్షను విరమింపజేసిన చంద్రబాబు - palla srinivas agitation on vishaka steel plant

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేస్తున్న తెదేపా నేత పల్లా శ్రీనివాసరావును ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పరామర్శించారు. విశాఖ కిమ్స్ ఐకాన్​ ఆస్పత్రిలో ఉన్న పల్లాకు ఓఆర్​​ఎస్​ ఇచ్చి దీక్షను విరమింపజేశారు.

cbn
పల్లా శ్రీనివాస్‌ నిరాహార దీక్షను విరమింపజేసిన చంద్రబాబు

By

Published : Feb 16, 2021, 6:37 PM IST

విశాఖ షీలానగర్‌లోని కిమ్స్‌ ఐకాన్ ఆస్పత్రిలో తెదేపా నేత పల్లా శ్రీనివాసరావును.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. ఓఆర్‌ఎస్ ఇచ్చి నిరాహార దీక్షను విరమింపజేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పల్లా.. ఈనెల 10న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.

సోమవారం అర్ధరాత్రి పల్లా ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. చంద్రబాబు పర్యటనకు ముందే పల్లాను ఆస్పత్రికి తరలించారు.

పల్లా శ్రీనివాస్‌ నిరాహార దీక్షను విరమింపజేసిన చంద్రబాబు

ఇవీచూడండి:విశాఖ ఉక్కు ఉద్యమానికి పల్లా ఊపిరి పోశారు: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details