తెలంగాణ

telangana

ETV Bharat / city

రానున్న రెండు రోజుల్లో రేషన్​ సరఫరా: తలసాని - తలసాని తాాజా వార్తలు

రానున్న రెండు రోజుల్లో రేషన్ బియ్యం పంపిణీ చేయనున్నట్లు మంత్రి తలసాని ప్రకటించారు. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకోంటున్న చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సికింద్రాబాద్ మున్సిపల్ కార్యాలయంలో పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో జరిగిన సమావేశంలో పలు సూచనలు చేశారు.

రానున్న రెండు రోజుల్లో రేషన్​ సరఫరా: తలసాని
రానున్న రెండు రోజుల్లో రేషన్​ సరఫరా: తలసాని

By

Published : Mar 27, 2020, 12:50 PM IST

Updated : Mar 27, 2020, 3:07 PM IST

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సికింద్రాబాద్ మున్సిపల్ కార్యాలయంలో పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో చర్చించారు. వ్యాధి నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందన్నారు.. ప్రజలు నిత్యావసరాల కోసం వచ్చి వెంటనే ఇళ్లకు వెళ్లాలని సూచించారు.

రానున్న రెండు రోజుల్లో రేషన్ బియ్యం పంపిణీ చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. జనసమూహాలు లేకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలంతా అధికారులకు సహకరించి కరోనా వైరస్ తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి ప్రతిరోజు రూ.150 కోట్ల నష్టం వచ్చినప్పటికీ ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని పునరుద్ఘాటించారు.

అనంతరం కాచిగూడ జీహెచ్ఎంసీ వార్డు కార్యాలయంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కార్పొరేటర్లు, మున్సిపల్, పోలీస్, రెవెన్యూ, వాటర్ వర్క్స్ అధికారులతో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు..

ఇవీ చూడండి:కరోనా పంజా: 17 మరణాలు- 724 కేసులు

Last Updated : Mar 27, 2020, 3:07 PM IST

ABOUT THE AUTHOR

...view details