ఏపీలోని శ్రీకాకుళంలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామివారు పర్వదినాల్లో బంగారు ఆభరణాల అలంకరణతో దర్శనమివ్వనున్నారు. కార్తీక ఏకాదశి నాడు బంగారు ఆభరణాలు ధరింపచేయటం ఆనవాయితి. కానీ భద్రతా కారణాల దృష్ట్యా 2008 రథసప్తమి తర్వాత ఇప్పటివరకు సూర్య భగవానుడిని వెండి నగలతోనే అలంకరిస్తున్నారు.
స్వర్ణాభరణాలతో దర్శనమివ్వనున్న సూర్యనారాయణస్వామి.. - surya narayana swamy in gold ornaments news
ఏపీలోని శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి.. ఇకపై వచ్చే పర్వదినాల్లో బంగారు ఆభరణాలు ధరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ మేరకు పాలకమండలి నిర్ణయం తీసుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు.

స్వర్ణాభరణాలతో దర్శనమివ్వనున్న సూర్యనారాయణస్వామి
ఇకపై పర్వదినాల్లో మూలవిరాట్టుకు బంగారు ఆభరణాలతో అలంకరణ చేయాలని పాలకమండలి నిర్ణయం తీసుకుందని దేవాలయం ఈవో తెలిపారు. దీంతో 12 ఏళ్ల తర్వాత.. ఈనెల 25, 26న సూర్యభగవానుడు స్వర్ణాభరణాలతో భక్తులకు కనులవిందు చేయనున్నట్లు వెల్లడించారు.
- ఇదీ చదవండి :శోభాయమానం.. పద్మావతి అమ్మవారి పుష్పయాగ మహోత్సవం