తెలంగాణ

telangana

ETV Bharat / city

'ఆ ప్రధాని వల్లే దేశ ఆర్థిక వృద్ధిరేటు అలా ఉంది' - subramanya swamy on modi policy

1990 వరకు భారత జీడీపీ వృద్ధిరేటు తక్కువగా ఉండడానికి కారణం జవహర్‌లాల్‌ నెహ్రూనే కారణమని ఎంపీ సుబ్రమణ్య స్వామి అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన భారత ఆర్థిక వ్యవస్థపై పలు వ్యాఖ్యలు చేశారు.

subramanya swamy on indian economy
'ఆ ప్రధాని వల్లే దేశ ఆర్థిక వృద్ధిరేటు అలా ఉంది'

By

Published : Feb 19, 2020, 7:19 PM IST

వచ్చే పదేళ్లలో భారత్ బలమైన ఆర్థిక శక్తిగా ఆవిర్భవిస్తుందని రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్య స్వామి అన్నారు. 2020-21 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల వృద్ధి సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజ్ఞాభారతి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో నిర్వహించిన '2030 నాటికి బలమైన ఆర్థిక శక్తిగా భారత్' అనే అంశంపై రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్య స్వామి ప్రసంగించారు.

స్వాతంత్రం నాటి నుంచి 1990 వరకు భారత్ అంతగా అభివృద్ధి చెందలేదని సుబ్రమణ్య స్వామి తెలిపారు. ఈ సమయంలో ఏడాదికి 3.5 శాతం మాత్రమే జీడీపీ వృద్ధి సాధించిందన్నారు. దీనికి కారణం జవహర్‌లాల్ నెహ్రూనే అని ఆరోపించారు. నెహ్రూ సోవియట్ ఆర్థిక విధానాల వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. తిరిగి పీవీ నరసింహారావు హయాంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని కొనియాడారు. ఆ సమయంలో ఏడాదికి 8 శాతం జీడీపీ వృద్ధి సాధించిందన్నారు. ఆ తర్వాత వచ్చిన మన్మోహన్ సింగ్ కూడా దాన్ని కొనసాగించారన్నారు. ఇక అప్పటి నుంచి వృద్ధి ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఆర్థిక సంస్కరణలు తీసుకొస్తున్నారని కొనియాడారు.

నిరుద్యోగ నిర్మూలన, పేదరిక నిర్మూలన వంటి వాటిపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించిందని పేర్కొన్నారు. ఏడాదికి 10శాతం వృద్ధితో వచ్చే పదేళ్లలో భారత్ చైనాను కూడా అధిగమిస్తుందన్నారు. ఇదేవిధంగా వృద్ధి సాధిస్తూ పోతే.. భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలోకి చేరుతుందన్నారు.

'ఆ ప్రధాని వల్లే దేశ ఆర్థిక వృద్ధిరేటు అలా ఉంది'

ఇవీ చూడండి:'మంత్రి కోర్టుకు వస్తారా?.. వివరణ ఇస్తారా?

ABOUT THE AUTHOR

...view details