"మా విద్యాసంస్థలో కుల, మతాలకు తావుండదు. సర్వమతాలు సమానం " అని విద్యార్థులకు నేర్పుతామని.. విజయవాడలో రైట్ కంప్యూటర్స్ సంస్థ నిర్వాహకుడు సయ్యద్ బాషా చెప్పారు. తమ విద్యార్థుల కోరిక మేరకు అయోధ్య రామమందిర నిర్మాణానికి విరాళాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.
అయోధ్య రామమందిరానికి సయ్యద్ సంస్థ విరాళం - విజయవాడ రైట్ కంప్యూటర్స్ తాజా వార్తలు
కుల, మతాలకు అతీతమైనవి పాఠశాలలు... విద్యార్థులకు సర్వ మత సమానత్వాన్ని నేర్పుతూ.. వారిలో లౌకికవాదాన్ని పెంపొందించటంలో విద్యాలయాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. అలాంటి లౌకిక వాదానికి పెద్ద పీట వేస్తోంది విజయవాడలోని రైట్ కంప్యూటర్స్. ఈ సంస్థకి చెందిన వివిధ మతాలకు చెందిన విద్యార్థులు అయోధ్య రామమందిర నిర్మాణానికి విరాళాలు అందించారు.
అయోధ్య రామమందిర నిర్మాణానికి విద్యార్థుల విరాళం
దేశంలోని విభిన్నమతాలు, జాతుల వర్గాల మేళవింపే భారతీయ సంస్కృతి. రామమందిరం నిర్మాణం వంటి పవిత్ర కార్యక్రమానికి విరాళాలు ఇవ్వటం.. సంతోషంగా ఉందని భాజపా మైనార్టీ మోర్చా ఏపీ అధ్యక్షుడు షేక్ బాజీ తెలిపారు. వివిధ మతాలకు చెందిన విద్యార్థులు తమ శక్తి కొలదీ రామాలయ నిర్మాణానికి విరాళాలు అందజేశారు.
ఇవీచూడండి:రామమందిర నిర్మాణ పనులు పునఃప్రారంభం