తెలంగాణ

telangana

By

Published : Feb 27, 2022, 4:48 AM IST

Updated : Feb 27, 2022, 8:12 AM IST

ETV Bharat / city

Telangana Students in Ukraine: హైదరాబాద్​ చేరుకున్న విద్యార్థులు

Telangana Students in Ukraine: యుద్ధభూమిలో చిక్కుకుని బిక్కుబిక్కుమంటూ.. భయం గుప్పిట్లో బతికిన తెలుగు విద్యార్థుల్లో కొంత మంది స్వదేశానికి చేరుకున్నారు. అందులో తెలంగాణకు చెందిన విద్యార్థులు.. హైదరాబాద్​ శంషాబాద్​ విమానాశ్రయానికి చేరుకున్నారు.

students-coming-to-hyderabad-from-ukraine-today
students-coming-to-hyderabad-from-ukraine-today

Telangana Students in Ukraine: ఉక్రెయిన్‌ నుంచి తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్థులు స్వదేశానికి చేరుకున్నారు. వారిలో తెలంగాణకు చెందిన విద్యార్థులను హైదరాబాద్‌ చేరవేయడానికి అన్ని ఏర్పాట్టు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. ఇప్పటికే విద్యార్ధులతో కూడిన ఓ విమానం ముంబయికి.. మరో విమానం దిల్లీకి చేరుకుందని సోమేష్‌ కుమార్‌ తెలిపారు. విద్యార్థులను హైదరాబాద్​కు తరలించడానికి ప్రభుత్వం ఉచితంగా విమాన టికెట్లు అందజేయడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు సీఎస్​ వివరించారు.

హైదరాబాద్​కు విద్యార్థులు..

హైదరాబాద్​ శివారులోని శంషాబాద్‌ విమానాశ్రయానికి 20 మంది విద్యార్థులు చేరుకున్నారు. నిన్న రాత్రి ఉక్రెయిన్‌ నుంచి ముంబయి చేరుకున్న విద్యార్థులు.. కాసేపటి క్రితమే హైదరాబాగ్​కు చేరుకున్నారు.

ఇదీ చూడండి:

Last Updated : Feb 27, 2022, 8:12 AM IST

ABOUT THE AUTHOR

...view details