తెలంగాణ

telangana

"జీతాల కోసం కాదు... ఆర్టీసీ పరిరక్షణ కోసం సమ్మె"

By

Published : Oct 17, 2019, 2:54 PM IST

హైదరాబాద్​ ఇందిరాపార్క్‌ వద్ద వామపక్షాలు చేపట్టిన సామూహిక నిరాహార దీక్షకు ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ మద్దతు తెలిపారు. కార్మికులు జీతాల కోసం కాదు, ఆర్టీసీ పరిరక్షణ కోసం సమ్మె  చేస్తున్నారని తెలిపారు.

జీతాల కోసం కాదు, ఆర్టీసీ పరిరక్షణ కోసం "సమ్మె"

జీతాల కోసం కాదు, ఆర్టీసీ పరిరక్షణ కోసం "సమ్మె"

కార్మికులు జీతాల కోసం కాదు, ఆర్టీసీ పరిరక్షణ కోసం సమ్మె చేస్తున్నారని ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ తెలిపారు. ఇందిరాపార్క్‌ వద్ద వామపక్షాలు చేపట్టిన సామూహిక నిరాహార దీక్షకు ఆయన సంఘీబావం తెలిపారు. ఆర్టీసీ ఐకాస బంద్‌కు మద్దతుగా వామపక్షాలు ఈకార్యక్రమం చేపట్టాయి. కార్మికుల వల్లే ఆర్టీసీకి నష్టమంటూ ప్రభుత్వం దుష్ప్రాచారం చేస్తోందని... ఆర్టీసీకి పట్టణ రవాణాలోనే కోట్ల నష్టం వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏటా రూ.720కోట్ల నష్టం వస్తోందని నాగేశ్వర్​ వెల్లడించారు. 3 వేల అద్దె బస్సులు పెంచితే ఆర్టీసీ నిండా మునుగుతుందని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details