తెలంగాణ

telangana

ETV Bharat / city

హైదరాబాద్​లో రోడ్డెక్కిన చిరువ్యాపారులు

వారు ఎండ, వాన, చలి ఇవేవీ చూడరు. కడుపునిండా రెండు పూటలు తినాలంటే.. వారంలో అన్ని రోజులు పనిచేయాల్సిందే. ప్రభుత్వం తమ పొట్టకూటి కొట్టారంటూ.. హైదరాబాద్​లో చిరువ్యాపారులు ధర్నా నిర్వహించారు. భారత్​నగర్​ వంతెన వద్ద దుకాణాలను తొలగించడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.

By

Published : Apr 20, 2019, 7:49 PM IST

హైదరాబాద్​లో రోడ్డెక్కిన చిరువ్యాపారులు

హైదరాబాద్​లో రోడ్డెక్కిన చిరువ్యాపారులు

హైదరాబాద్​ భారత్​నగర్​ ఫ్లై ఓవర్​ వద్ద చిరువ్యాపారులు ధర్నా నిర్వహించారు. ట్రాఫిక్​ పోలీసులు తమ దుకాణాలు తొలగించడంపై నిరసన వ్యక్తం చేశారు. ఎలాంటి సమాచారం లేకుండా అర్ధరాత్రి సమయంలో మెట్రో సిబ్బంది దుకాణాలు తీసివేశారని ఆవేదన చెందారు. ఈ ధర్నాకు మద్దతుగా స్థానిక నాయకులు, నేషనల్​ హాకీ ఫెడరేషన్​ నాయకులు నిలిచారు.
ఒకవేళ తొలగించాల్సివస్తే.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అన్నారు. తమకు బతకడానికి ఉన్న చిరు వ్యాపారాలను తొలగించి రోడ్డుపైకి లాగారని మండిపడ్డారు. పెట్టుబడిదారులకు ఎకరాల కొద్దీ స్థలం ఇస్తున్న ప్రభుత్వం... చిరు వ్యాపారులకు తోపుడుబండి ఏర్పాటు చేసుకునేందుకు స్థలం మాత్రం ఇవ్వడం లేదని వాపోయారు.
ఇప్పటికైనా.. బండ్లు నడుపుకునేందుకు అనుమతి ఇవ్వాలని లేనిచో తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details