ఈఎస్ఐ కుంభకోణంలో తవ్వేకొద్ది అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. ఐదేళ్ల కాలంలో ఐఎంఎస్ ద్వారా దాదాపు రూ. 1000 కోట్లు ఖర్చు చేయగా అందులో రూ.200 కోట్లు అవినీతి జరిగినట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు భావిస్తున్నారు.
దొంగలంతా ఉన్నతాధికారులే..?
దోచుకున్న డబ్బుతో బినామీల పేరున ఆస్తులు కూడబెట్టినట్లు అనిశా గుర్తించింది. కార్మికశాఖలోని కొందరు ఉన్నతాధికారులకూ కొంత సొమ్ము ముట్టినట్లు అనుమానించారు. అయితే వీటికి సంబంధించిన ఆధారాలు సేకరించలేకపోయారు.
లెక్క తేలటం లేదు
ఐదేళ్ల కాలంలో కొల్లగొట్టారని భావిస్తున్న సొమ్ముకి, నిందితుల ఆస్తులకు పొంతన కుదరడం లేదు. నిందితులను ప్రశ్నించినా ఈ విషయాలపై వివరాలు రాబట్టలేకపోయారు. ఒకవైపు అనిశా దర్యాప్తు కొనసాగుతుండగానే ఆస్తుల గుట్టు విప్పేందుకు ఈడీ రంగంలోకి దిగింది.