కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై న్యాయ పోరాటం చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో జరిగిన సీఎల్పీ సమావేశానికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ హాజరయ్యారు. పార్టీ పిరాయింపులపై న్యాయ పోరాటం చేసేందుకు అవసరమైన ఆధారాలను సిద్ధం చేయాలని, తాను కూడా సీనియర్ న్యాయవాదులతో చర్చిస్తానని చెప్పినట్టు సమాచారం.
రెండు రోజులుగా పార్టీ సమావేశాలు జరుగుతుండగా కోర్కమిటీ సమావేశానికి, దుబ్బాక నియోజకవర్గ సన్నాహక సమావేశానికి ఎందుకు హాజరు కాలేదని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని మాణిక్కం ప్రశ్నించగా... వ్యక్తిగత కారణాలతో రాలేకపోయానని... ఇంకోసారి జరగదని జగ్గారెడ్డి వివరణ ఇచ్చుకున్నట్టు తెలిసింది. సీఎల్పీ సమావేశం తరువాత జగ్గారెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఠాగూర్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.