అంతర్జాలంలో వీనుల విందుగా తెలుగు పద్యాలు.. - e-book website
ఔత్సాహికుల కోసం తెలుగు పద్యాలను అంతర్జాలంలోఅందుబాటులో ఉంచింది రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ మండలి. ఈ బుక్ పేరుతో ఉన్న ఈ సైట్లోని పద్యాలను దేశవిదేశాలకు చెందిన సుమారు లక్షన్నర మంది విని, లైక్ చేయడం విశేషం.
![అంతర్జాలంలో వీనుల విందుగా తెలుగు పద్యాలు.. Telugu poems on the internet](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9481707-739-9481707-1604885131608.jpg)
అంతర్జాలంలో తెలుగు పద్యాలు
వేమన, సుమతి, భాస్కర, కుమార, దాశరథి తదితర శతకాల్లోని పేరొందిన పద్యాలను ఔత్సాహికులు చదివేలా, వీనులవిందుగా వినేలా ‘ఈ బుక్’ రూపేణా అంతర్జాలంలో అందుబాటులో ఉంచింది రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ మండలి(ఎస్సీఈఆర్టీ). ఇందుకోసం ఎస్సీఈఆర్టీ స్టేట్ రిసోర్సు గ్రూపులోని 40 మంది ఉపాధ్యాయులతో ఆయా పద్యాలను రికార్డు చేయించింది. ఇటీవలే మొదలైన ఈ సైట్లో పొందుపరిచిన పద్యాలను దేశవిదేశాలకు చెందిన సుమారు లక్షన్నర మంది విని లైక్ చేయడం విశేషం.
- ఇదీ చూడండిరాష్ట్రంపై పంజా విసురుతున్న చలిపులి