- డబీర్పురా పీహెచ్సీలో ఇటీవల వైద్యునితోపాటు మిగతా సిబ్బందికి కరోనా సోకింది. కొందరు హోం ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. దీంతో కాంట్రాక్టు సిబ్బందితో కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు.
- వాస్తవానికి ఒక పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఒకరు లేదా ఇద్దరు వైద్యులతో సహ ఒక పబ్లిక్ హెల్త్ నర్సు(పీహెచ్ఎన్), 3 నుంచి 4మంది ఏఎన్ఎంలు, ఒక ల్యాబ్ టెక్నిషియన్, ఒక ఫార్మాసిస్ట్, ఆయా, అటెండరు మొత్తం 10 నుంచి 12 మంది వరకు ఉండాలి. నగరంలో అనేక కేంద్రాల్లో ముగ్గురు నుంచి
- ఇక నగర శివార్లలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని ఆరోగ్య కేంద్రాల్లో 15 మందికి ఆరుగురు లేదా ఏడుగురితోనే నెట్టుకొస్తున్నారు. ఫలితంగా కొవిడ్ టెస్ట్ల్లో జాప్యం జరుగుతోంది.
ఒకవైపు కరోనా విలయతాండవం చేస్తోంది. నిత్యం వేలాది మంది ఈ మహమ్మారి గుప్పిట పడి నలిగిపోతున్నారు. ఈ తరుణంలో పరీక్షల నుంచి చికిత్సల వరకు ఒక కట్టుదిట్టమైన పకడ్బందీ ప్రణాళిక ఉండాలి. అయితే మౌలిక వసతుల కొరతతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కరోనా రెండో విడతలో పీహెచ్సీలు, యూపీహెచ్సీలపై భారీగా ఒత్తిడి పెరిగింది. అరకొర సిబ్బందితో ప్రజలకు టెస్టులు చేయడం.. మందులు పంపిణీ చేయడం సాధ్యం కావడం లేదు. రోగుల తాకిడి నేపథ్యంలో తక్షణం వైద్య ఆరోగ్యశాఖ స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.