డీఎస్సీ-2008 బాధితులైన 2,190 మంది అర్హులకు ఎస్జీటీ పోస్టింగ్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. వీరికోసం ప్రత్యేక రిక్రూట్మెంట్ చేపడతామని తెలిపారు. మినిమమ్ టైమ్ స్కేల్లో పని చేయడానికి డీఎస్సీ-2008 బాధిత అభ్యర్థులు రాత పూర్వకంగా అంగీకారం తెలిపారని వివరించారు. 2018 డీఎస్సీలో పోస్టుల భర్తీలో భాగంగా 486 పీఈటీ పోస్టులను భర్తీ చేయనున్నామని తెలిపారు. 2018 డీఎస్సీకి సంబంధించి 387 పోస్టులు పెండింగ్లో ఉంటాయని, వాటినీ త్వరలో భర్తీ చేస్తామన్నారు. ఏపీ టెట్-2021 సిలబస్ సిద్ధం చేసి http://aptet.apcfss.in/ వెబ్సైట్లో పెట్టామని మంత్రి ఆదిమూలపు సురేశ్ వివరించారు.
DSC-2008: 'డీఎస్సీ-2008 బాధితుల కోసం ప్రత్యేక రిక్రూట్మెంట్' - AP News
డీఎస్సీ-2008 బాధితులకు న్యాయం చేస్తున్నామని ఏపీ విద్యాశాఖ మంత్రి సురేశ్ వెల్లడించారు. 2,190 మందికి ఎస్జీటీ పోస్టులు ఇవ్వాలని నిర్ణయించినట్టు వివరించారు. 12 ఏళ్లు పోరాటం చేసిన వారికి న్యాయం చేయాలని సీఎం నిర్ణయించారని తెలిపారు. డీఎస్సీ-2008 బాధితుల కోసం ప్రత్యేక రిక్రూట్మెంట్ చేపడతామని చెప్పారు. 2018 డీఎస్సీ పెండింగ్ పోస్టులనూ భర్తీ చేస్తున్నామని స్పష్టం చేశారు.
'డీఎస్సీ-2008 బాధితుల కోసం ప్రత్యేక రిక్రూట్మెంట్'