తెలంగాణ

telangana

ETV Bharat / city

రోజుకు అరవై టీఎంసీల నీరు దిగువకు... - undefined

కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. కృష్ణమ్మ ఉప్పొంగుతూ సంద్రం దిశగా వడివడిగా పరుగులు పెడుతోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల ప్రాజెక్టుల నుంచి సగటున రోజుకు అరవై టీఎంసీల నీరు దిగువకు వదులుతున్నారు.

రోజుకు అరవై టీఎంసీల నీరు దిగువకు...

By

Published : Aug 17, 2019, 6:38 AM IST

Updated : Aug 17, 2019, 9:35 AM IST

రోజుకు అరవై టీఎంసీల నీరు దిగువకు...

కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో వరద నిలకడగా కొనసాగుతోంది. రెండు రోజులుగా శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల ప్రాజెక్టుల నుంచి సగటున రోజుకు అరవై టీఎంసీల నీరు దిగువకు వదులుతున్నారు. గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం వరకు 12 గంటల వ్యవధిలో శ్రీశైలం నుంచి 32.80 టీఎంసీలు.. మొత్తంగా ఒక్కరోజులో 60 టీఎంసీలకు పైగా నీటిని దిగువకు విడుదల చేశారు.

సాగర్‌ నుంచి దిగువకు ఏడు లక్షల క్యూసెక్కుల ప్రవాహం
తుంగభద్ర, కృష్ణా నదుల నుంచి శ్రీశైలానికి ఎనిమిది లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దిగువకు కూడా అంతే స్థాయిలో వదులుతున్నారు. సాగర్‌ నుంచి దిగువకు ఏడు లక్షలు, పులిచింతల నుంచి ఏడున్నర లక్షల క్యూసెక్కుల ప్రవాహం దిగువకు వెళ్తోంది.12 గంటల వ్యవధిలో సాగర్‌ ప్రాజెక్టుకున్న 26 క్రస్ట్‌గేట్ల ద్వారా 32.04 టీఎంసీలు, పులిచింతల నుంచి 33.56 టీఎంసీలు కిందికి వదిలారు.

మట్టపల్లి క్షేత్రంలో అయిదు అడుగుల మేర చేరిన నీరు
సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం శూన్యపహాడ్‌ వద్ద పులిచింతల బ్యాక్‌ వాటర్‌ పెరగడం వల్ల మూసీ నదిపై ఉన్న వంతెన నీట మునిగింది. దీనివల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రసిద్ధ మట్టపల్లి క్షేత్రంలోకి దాదాపు అయిదు అడుగుల మేర నీరు చేరింది. ఉత్సవమూర్తులను పక్కనే ఉన్న యజ్ఞశాలకు తరలించి అర్చకులు స్వామి వారికి పూజలను నిర్వహిస్తున్నారు.

ఇవీ చూడండి: కొత్త "రెవెన్యూ" చట్టంతో కీలక మార్పులు

Last Updated : Aug 17, 2019, 9:35 AM IST

For All Latest Updates

TAGGED:

PROJECTS

ABOUT THE AUTHOR

...view details