రాష్ట్రంలో లాక్డౌన్ ఆంక్షలు ఆరో రోజు పకడ్బందీగా అమలవుతున్నాయి. ప్రజలు ఉదయం వేళ నిత్యావసర వస్తువులు కొనేందుకు పెద్ద సంఖ్యలో బయటకు వచ్చారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఆంక్షల సడలింపు ఉన్నందున మార్కెట్లకు పోటెత్తారు. పలు చోట్ల ప్రజలు కొవిడ్ నిబంధనలు మరిచి... భౌతిక దూరం పాటించకుండానే కొనుగోళ్లు సాగించారు.
రాష్ట్రంలో కొనసాగుతున్న లాక్డౌన్.. పలుచోట్ల నిబంధనల ఉల్లంఘన - telangana lockdown updates
తెలంగాణలో లాక్డౌన్ ఆంక్షలు ఆరో రోజు పటిష్ఠంగా అమలవుతున్నాయి. ఉదయం వేళ నిత్యావసర సరకులు కొనుగోలు చేసేందుకు ప్రజలు బయటకు వచ్చారు. కొన్ని చోట్ల కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన వారిని పోలీసులు హెచ్చరించారు.
![రాష్ట్రంలో కొనసాగుతున్న లాక్డౌన్.. పలుచోట్ల నిబంధనల ఉల్లంఘన telangana lockdown, telangana lockdown updates,telangana lockdown news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11788673-690-11788673-1621233346774.jpg)
తెలంగాణ లాక్డౌన్, తెలంగాణ లాక్డౌన్ అప్డేట్స్, తెలంగాణ లాక్డౌన్ న్యూస్
ఉదయం 10 గంటలు దాటిన తర్వాత రహదారిపైకి వచ్చిన వాహనదారులను పోలీసులు హెచ్చరించారు. అత్యవసర పరిస్థితిల్లో మాత్రమే బయటకు రావాలని సూచించారు. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటిస్తూ మహమ్మారి కట్టడికి కృషి చేయాలని కోరారు.
- ఇదీ చదవండిభాజపా నేత లక్ష్మణ్కు కరోనా పాజిటివ్