ఏపీ కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వివాదంపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుకు.. తాళ్లాయపాలెం శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి మధ్యంతర నివేదిక అందించారు. 9 మంది పీఠాధిపతులు మఠాన్ని సందర్శించి అందరి అభిప్రాయాలు సేకరించినట్లు శివస్వామి తెలిపారు. 11వ పీఠాధిపతి రెండో భార్య వీలునామాపై సుదీర్ఘంగా చర్చించినట్లు వివరించారు.
బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వివాదంపై వెల్లంపల్లికి మధ్యంతర నివేదిక - మంత్రి వెళ్లంపల్లిని కిలిసిన తాళ్లాయపాలెం శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి
ఏపీ కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వివాదంపై.. 9 మంది పీఠాధిపతులు మఠాన్ని సందర్శించి అందరి అభిప్రాయాలు సేకరించినట్లు తాళ్లాయపాలెం శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి తెలిపారు. దీనిపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లిని కలిసి మధ్యంతర నివేదిక అందించారు.
Brahmam gari matam
మఠంలో అవకతవకలు జరుగుతున్నాయని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆలయ కీర్తి ప్రతిష్టలు దెబ్బతినకుండా వెంటనే దేవాదాయ శాఖ ఓ అధికారిని నియమించాలని మంత్రిని కోరినట్లు చెప్పారు. పూర్తి నివేదికను పదో తేదీలోపు ప్రభుత్వానికి అందిస్తామన్నారు.