మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ నాచారం మహంకాళి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే శివాలయానికి భక్తులు బారులు తీరారు. శివరాత్రి పురస్కరించుకోని స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వారికి ఏలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
మహంకాళి ఆలయానికి పోటెత్తిన భక్తులు - మహంకాళి ఆలయానికి పోటెత్తిన భక్తులు
శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలోని ఆలయాలన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నాచారంలోని మహంకాళి అమ్మవారి దర్శనానికి ఉదయం నుంచి భక్తులు బారులు తీరారు.

మహంకాళి ఆలయానికి పోటెత్తిన భక్తులు