తెలంగాణ

telangana

ETV Bharat / city

Sivarathri in Srisailam: శ్రీశైల మల్లన్నకు పట్టు వస్త్రాలు.. సమర్పించిన దేవస్థానాలు.. - శ్రీశైలానికి కాణిపాకం పట్టువస్త్రాలు

Sivarathri in Srisailam : ద్వాదశ లింగాల్లో ఒకటైన శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని కాణిపాకం, విజయవాడ దేవస్థానాల తరఫున స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు.

Sivarathri in Srisailam: శ్రీశైల మల్లన్నకు పట్టు వస్త్రాలు.. సమర్పించిన దేవస్థానాలు..
Sivarathri in Srisailam: శ్రీశైల మల్లన్నకు పట్టు వస్త్రాలు.. సమర్పించిన దేవస్థానాలు..

By

Published : Feb 26, 2022, 7:49 PM IST

Sivarathri in Srisailam : ద్వాదశ లింగాల్లో ఒకటైన శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం తరఫున ఛైర్మన్ మోహన్ రెడ్డి, సభ్యులు రామసుబ్బమ్మ, ఈవో వెంకటేష్ పట్టు వస్త్రాలు తీసుకొచ్చి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లకు సమర్పించారు.

విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం తరఫున ఈవో భ్రమరాంబ స్వామి పట్టువస్త్రాలు సమర్పించారు. వారికి శ్రీశైల దేవస్థానం ఈవో లవన్న, అర్చకులు సాదర స్వాగతం పలికారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వేద ఆశీర్వచనం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.

శ్రీశైల మల్లన్నకు పట్టు వస్త్రాలు.. సమర్పించిన దేవస్థానాలు..

ఇదీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details