కరోనా ప్రభావం నేపథ్యంలో వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా వ్యాపార సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నాయి. చిన్నపాటి దుకాణదారుల నుంచి బడా సంస్థల వరకు యాప్ల బాట పడుతున్నాయి. తమ వ్యాపారానికి అనుగుణంగా మొబైల్ యాప్లను రూపొందించుకుంటున్నాయి. వినియోగదారుల సెల్ఫోన్ నంబర్లను సమీకరించి యాప్లతో అనుసంధానించుకుంటున్నాయి. అదనపు ధరలేవీ లేకుండానే సేవలందిస్తున్నాయి.
దుకాణ యాప్లకు గిరాకీ
కరోనా కారణంగా దుకాణాలకు సంబంధించిన పెరిగింది. ఒక్కో యాప్ తయారీకి రూ.లక్షలు వ్యయం చేస్తున్నారు. కొన్ని మొబైల్ యాప్లను పేజీలవారీగా వినియోగించుకునేందుకు దుకాణాల యజమానులు బృందంగా ఏర్పడుతున్నారు. దీనివల్ల ఒక్కో దుకాణానికి రూ.50 వేల వరకే వ్యయమవుతోందని చెబుతున్నారు. కొందరు మాత్రం రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వ్యయం చేసి కొనుగోలు చేస్తున్నారు. యాప్ల వినియోగం ఎక్కువవడంతో సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు గిరాకీ పెరిగింది. గత పదిరోజుల్లో తనకు రూ.15 లక్షల ఆర్డర్లు వచ్చాయని భాను అనే ఇంజినీర్ ‘ఈనాడు’కు తెలిపారు. ఏడాదంతా నిర్వహించేందుకు కూడా కొంత మొత్తం తీసుకుంటామని వివరించారు.