Shivaratri Brahmotsavam in srisailam : శ్రీశైల మహాక్షేత్రంలో వచ్చే నెల 22వ తేదీ నుంచి మార్చి 4 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయని ఈవో ఎస్.లవన్న తెలిపారు. ఉత్సవాల సమయంలో ముందస్తుగా గదుల రిజర్వేషన్ చేసుకునే సదుపాయాన్ని నిలిపివేస్తున్నట్లు ఈవో తెలిపారు. కుటీర నిర్మాణ పథకం కింద వసతిగదులు నిర్మించిన దాతలకు మాత్రం గతంలో లాగా ముందస్తు రిజర్వేషన్ ఉంటుందన్నారు.
Shivaratri Brahmotsavam in srisailam : ఫిబ్రవరి 22 నుంచి శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు - తెలంగాణ వార్తలు
Shivaratri Brahmotsavam in srisailam : శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో ఫిబ్రవరి 22 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ మేరకు ఈవో ఎస్.లవన్న వివరాలు వెల్లడించారు.
![Shivaratri Brahmotsavam in srisailam : ఫిబ్రవరి 22 నుంచి శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు Brahmotsavam in srisailam, shivaratri special pooja](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14258447-1015-14258447-1642902008632.jpg)
ఫిబ్రవరి 22 నుంచి శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు
దాతలు వసతి పొందేందుకు ఫిబ్రవరి 10వ తేదీలోగా దేవస్థానం కార్యాలయానికి లిఖితపూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుందన్నారు. ఆ తర్వాత వచ్చిన లేఖలను పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదని పేర్కొన్నారు.
ఇదీచదవండి:వైష్ణవతత్వం ఉట్టిపడేలా ముస్తాబవుతున్న పంచ నారసింహుల దివ్యక్షేత్రం