తెలంగాణ

telangana

By

Published : Sep 20, 2020, 9:29 AM IST

ETV Bharat / city

ఏపీలో రేపటి నుంచి తెరచుకోనున్న పాఠశాలలు

కరోనా వ్యాప్తి కారణంగా ఇంత కాలం పాఠశాలలు, కాలేజీలను తెరవలేదు. ఆంధ్రప్రదేశ్​లో రేపటి నుంచి పాఠశాలలు, జూనియర్ కళాశాలలు తెరచుకోనున్నాయి. సందేహాల నివృత్తికి 9-12 తరగతుల వారికి పాఠశాల, కళాశాలకు వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నారు. 1 నుంచి 8 తరగతుల వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాలకు పిలిపించకూడదు.

Schools will open from tomorrow in andhra pradesh
రేపటి నుంచి తెరచుకోనున్న పాఠశాలలు

ఆంధ్రప్రదేశ్​లో కంటెయిన్​మెంట్ జోన్లకు వెలుపల ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు విద్యా సంస్థలను సోమవారం నుంచి తెరవనున్నారు. మొదటి రోజు ఉపాధ్యాయులందరూ విధులకు హాజరుకావాల్సి ఉంటుంది. 22 నుంచి ఆల్​లైన్ బోధన, టెలి కౌన్సెలింగ్, విద్యా వారధి తదితర కార్యక్రమాల కోసం సగం మంది ఉపాధ్యాయులు విధులకు హాజరవుతారు. 9 నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులు తమ సందేహాలు నివృత్తికి తల్లిదండ్రుల అనుమతితో పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు వెళ్లొచ్చు.

1 నుంచి 8 తరగతుల వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాలకు పిలిపించకూడదు. రెసిడెన్షియల్, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు, సంక్షేమ వసతి గృహాల్లో చదివే విద్యార్థులకు వాట్సప్ గ్రూపు ద్వారా ఆన్​లైన్ లో మార్గనిర్దేశం చేస్తారు. కావాలనుకుంటే వీరు సమీపంలోని ఉన్నత పాఠశాలకు వెళ్లి, ఉపాధ్యాయుల సూచనలు, మార్గదర్శకాలు తీసుకోవచ్చు. విద్యావారధి, వద్యామృతం వంటి కార్యక్రమాలు అక్టోబర్ 5 వరకు కొనసాగుతాయి.

ఇదీ చదవండి:రేపటి నుంచి వెబ్​సైట్​లో ఎడ్​సెట్​ హాల్​టికెట్లు

ABOUT THE AUTHOR

...view details