తెలంగాణ

telangana

By

Published : Feb 1, 2021, 8:53 AM IST

Updated : Feb 1, 2021, 8:58 AM IST

ETV Bharat / city

మోగిన బడి గంట... విద్యార్థుల రాకతో నెలకొన్న సందడి

రాష్ట్రంలో బడిగంట మోగింది. పది నెలల విరామం అనంతరం విద్యా సంస్థలు పున: ప్రారంభమయ్యాయి. కరోనా పరిస్థితులతో మార్చిలో మూతపడిన పాఠశాలలు, కళాశాలలు... ఎట్టకేలకు తెరుచుకున్నాయి. విద్యార్థులందరూ కొవిడ్‌ నిబంధనలు పాటించేలా విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.

schools
schools

కరోనా కారణంగా రాష్ట్రవ్యాప్తంగా గత మార్చి 22న మూతపడిన విద్యాసంస్థలు... తెరుచుకున్నాయి. పాఠశాలల్లో 9, 10 ఆపై తరగతులకు ప్రత్యక్ష బోధన ప్రారంభమయ్యాయి. విద్యార్థుల రాకతో బడిలో సందడి వాతావరణం నెలకొంది. దాదాపు పది నెలల తర్వాత పాఠశాలకు రావడంతో తోటి విద్యార్థులను ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఇన్ని రోజులు ఇంటికే పరిమితమైన విద్యార్థులు పాఠశాలకు రావడంతో ఆనందానికి లోనయ్యారు. తల్లిదండ్రులే విద్యార్థులను పాఠశాలకు తీసుకువచ్చారు.

ఆన్​లైన్​లోనూ

ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఆన్‌లైన్ లేదా టీవీల ద్వారా బోధన కొనసాగనుంది. 6 నుంచి ఎనిమిదో తరగతులకు 15 రోజుల తర్వాత బోధన ప్రారంభించేందుకు యోచిస్తుండగా... ఐదో తరగతి వరకు ఈ ఏడాది ప్రత్యక్ష బోధన లేకుండానే ప్రమోట్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. విద్యా సంస్థలు ప్రారంభమైనా కూడా ఆన్​లైన్ బోధన కొనసాగించనున్నట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ ఏడాది పరీక్షలు రాసేందుకు కనీస హాజరు నిబంధన ఉండదని వెల్లడించింది.

ప్రత్యేక మార్గదర్శకాలు

తరగతి గదుల నిర్వహణకు విద్యాశాఖ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రతి గదిలోనూ భౌతికదూరం పాటిస్తూ... 20 మంది విద్యార్థులు హాజరయ్యేలా చర్యలు తీసుకున్నారు. తప్పనిసరిగా మాస్క్ ధరించటం, థర్మల్ స్క్రీనింగ్‌తో పాటు తల్లిదండ్రుల అనుమతి పత్రం ఉంటేనే తరగతిలోకి అనుమతించారు. విద్యా సంస్థల్లో 2 ప్రత్యేక ఐసోలేషన్ గదుల ఏర్పాటు, కొవిడ్ లక్షణాలు ఉన్న వారికి అనుమతులు, ఎవరికైనా లక్షణాలుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ... మార్గదర్శకాలు జారీ చేసింది.

మోగిన బడి గంట... విద్యార్థుల రాకతో నెలకొన్న సందడి

ఇదీ చదవండి :కొత్త ప్రైవేట్‌ బడులు.. వస్తూనే ఉన్నాయ్‌..

Last Updated : Feb 1, 2021, 8:58 AM IST

ABOUT THE AUTHOR

...view details