తెలంగాణ

telangana

ETV Bharat / city

'ప్రతి ఏడాది ఇదే ఇబ్బంది.. అయినా ఎవరికీ పట్టదు' - Sarva Shiksha Abhiyan staff protest in Hyderabad

సర్వశిక్షా అభియాన్​లో పనిచేస్తున్న తమను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్​లో తాత్కాలిక ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. లక్డీకపూల్​లో నాలుగురోజులుగా నిరసన చేస్తున్నా.. సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు.

sarva-shiksha-abhiyan-staff-protest-at-lakdikapool-in-hyderabad
హైదరాబాద్​లో తాత్కాలిక టీచర్ల ఆందోళన

By

Published : Feb 18, 2021, 12:40 PM IST

సర్వశిక్షా అభియాన్‌లో పని చేస్తున్న తమను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని తాత్కాలిక ఉపాధ్యాయులు హైదరాబాద్​లో నిరసనకు దిగారు. లక్డీకపూల్​లో విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయం వద్ద నాలుగు రోజులుగా నిరసన చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలు పునఃప్రారంభం కావడం వల్ల సర్వ శిక్షా అభియాన్‌లో పని చేస్తున్న తమను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

కేంద్రం బడ్జెట్‌ విడుదల చేసినా... రాష్ట్ర ప్రభుత్వం మాత్రం విధులు తిరిగి అప్పగించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సర్వ శిక్షా అభియాన్‌లో 13 విభాగాల్లో పన్నెండింటిలో ఉన్న వారిని రీఎంగేజ్ చేశారని.. తమను మాత్రం పట్టించుకోవడం లేదని వాపోయారు. కమిషనర్‌ తమ గోడు వినే వరకు కదలమని తేల్చి చెప్పారు. కమిషనర్‌ కోసం మూడు రోజులుగా వేచి చూస్తున్నామని.. ఆయన వచ్చి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

సాధారణ ఉపాధ్యాయులతో సమానంగా పనిచేస్తున్నా ప్రతి ఏడాది రీఎంగేజ్ సమయంలో ఇబ్బంది పడాల్సివస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని... లేనిపక్షంలో ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details