విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్డీఐలను) ఆకర్షించడంలో తెలుగు రాష్ట్రాలు వెనుకబడ్డాయి. దేశంలోకి గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో రూ.4,37,188 కోట్ల ఎఫ్డీఐలు వచ్చాయి. అందులో అత్యధికంగా 37.46% వాటాతో కర్ణాటక తొలిస్థానంలో నిలవగా.. 26.78% పెట్టుబడులు సాధించి మహారాష్ట్ర రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఆ ఏడాది మొత్తం ఎఫ్డీఐల్లో ఈ రెండు రాష్ట్రాల వాటానే 64.24% ఉండడం విశేషం. అదే సమయంలో తెలంగాణకు రూ.11,965 కోట్ల (2.73%) పెట్టుబడులు వచ్చాయి. దక్షిణాదిలో కర్ణాటక, తమిళనాడు తర్వాత స్థానాన్ని, దేశవ్యాప్తంగా 7వ స్థానాన్ని తెలంగాణ దక్కించుకొంది. ఆంధ్రప్రదేశ్ కేవలం రూ.1,682 కోట్ల (0.38%) ఎఫ్డీఐలకు మాత్రమే పరిమితమై టాప్ 10లో స్థానాన్ని కోల్పోయింది. గత ఆర్థిక సంవత్సరంలో దేశంలోని ఆరు రాష్ట్రాలు ఒక్కోటి రూ.20 వేల కోట్లకుపైగా పెట్టుబడులను దక్కించుకున్నాయి. మొత్తం పెట్టుబడుల్లో వీటి వాటా 92.74% ఉంది. మిగిలిన అన్ని రాష్ట్రాల వాటా కలిపి 7.25%కి పరిమితమైనట్లు కేంద్ర పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం సమాచారాన్ని బట్టి తేలింది.
2019 అక్టోబరు నుంచి రాష్ట్రాలవారీగా లెక్కలు..