తెలంగాణ

telangana

ETV Bharat / city

హైదరాబాద్‌లో పెరుగుతున్న స్కిజోఫ్రీనియా కేసులు - హైదరాబాద్‌లో పెరుగుతున్న స్కిజోఫ్రీనియా కేసులు

‘అదిగో ఎవరో వస్తున్నారు.. నన్ను చంపేస్తారు, ఇదిగో దెయ్యం... నన్నే వెంబడిస్తోంది.. ఈ ధోరణి మీరు ఎవరిలోనైనా గుర్తిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. ఇటీవల మదనపల్లిలో ఈ తరహా ప్రవర్తనే శ్రుతిమించి కన్న కుమార్తెలను హత్య చేసే వరకు దారి తీసింది. దీన్నే స్కిజోఫ్రీనియా(మానసిక వైకల్యం) అని పిలుస్తున్నారు. దీని వల్ల కలిగే ఒకరకమైన భ్రాంతి(డెలూసన్‌)తో అసహజంగా ప్రవర్తిస్తారు. మదనపల్లిలో ఉన్నత విద్యావంతులైన తల్లిదండ్రులు దీని బారినపడటం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Rising schizophrenia cases in the hyderabad
హైదరాబాద్‌లో పెరుగుతున్న స్కిజోఫ్రీనియా కేసులు

By

Published : Jan 31, 2021, 3:35 PM IST

నగరంలో మనోవైకల్యం కేసులు పెరుగుతున్నాయి. మానసిక ఆందోళన, ఒత్తిడి, కుంగుబాటు తదితర సమస్యలతో వస్తున్న ప్రతి 10 మందిలో నలుగురిలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చికిత్సకు వస్తున్న వారిలో ఉద్యోగులు, ఉన్నత చదువులు చదివిన వారూ ఉంటున్నారని పేర్కొంటున్నారు.

కారణాలు:

లేని భయాలను ఊహించుకోవడం స్కిజోఫ్రీనియాకు ప్రధాన కారణమని మానసిక వైద్య నిపుణులు అంటున్నారు. మారుతున్న జీవనశైలి, వృత్తి, వ్యక్తిగతమైన ఒత్తిడి, ఆందోళన, కుటుంబ సభ్యులు దూరం, కళ్లముందే జరిగే ఘటనలు, ఆ తరహా సాహిత్యం చదవడం, సినిమాలు చూడటం... తదితర కారణాలు దీనికి దోహదం చేస్తాయి. 50 శాతం మంది రోగుల్లో కుటుంబ చరిత్ర ప్రధానమని వైద్యులు పేర్కొంటున్నారు.

హైదరాబాద్‌లో పెరుగుతున్న స్కిజోఫ్రీనియా కేసులు

ఇవీ లక్షణాలు...

  • భయం, భ్రాంతి, అనుమానంతో ఈ సమస్య మొదలవుతుంది.
  • మొగ్గలోనే ఇలాంటి అనుమానాలు తుంచేయాలి.
  • మానసిక ఒత్తిడి, భయం, ఆందోళనతో చివరికి స్కిజోఫ్రీనియాలోకి జారుకుంటారు.
  • సర్దిచెప్పడానికి ప్రయత్నించినా కొట్టడానికి వెనుకాడరు.
  • తమను తాము హింసించుకొంటారు. తీవ్రంగా భయపడుతుంటారు.
  • అర్ధరాత్రి కిటికీలోంచి బయటకు చూస్తుంటారు. బయటకు వచ్చేందుకు ఇష్టపడరు.
  • ఇంట్లో కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు ఇష్టపడరు.

సరైన చికిత్సలతో నయం:

"స్కిజోఫ్రీనియాతో వచ్చే భ్రాంతి(డెలూసన్స్‌) చాలా ప్రమాదకరమైన మానసిక సమస్య. దీంతో బాధపడేవారికి స్నేహితులు, కుటుంబ సభ్యులు భరోసాగా నిలవాలి. కౌన్సెలింగ్‌తో నయం కాదు. తొలుత మందులు అందించి తర్వాత కౌన్సెలింగ్‌ చేయాలి. కచ్చితమైన చికిత్స అందితే 3 నెలలకు తిరిగి సాధారణ స్థితికి వస్తారు. పిల్లల వద్ద దెయ్యాలు, బ్లాక్‌ మ్యాజిక్స్‌ వంటి వాటి గురించి తరచూ మాట్లాడొద్దు."

-డాక్టర్‌ కృష్ణ సాహితి, సైక్రియాట్రిస్టు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, అపోలో వైద్య కళాశాల

ఇదీ చూడండి: సబ్సిడీ రుణాల దరఖాస్తు తేదీ పెంపు: మంత్రి కొప్పుల

ABOUT THE AUTHOR

...view details