తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా 34,723 యూనిట్ల రక్త సేకరణ - జగన్ జన్మదినం రోజున రక్తి నిల్వలు సేకరణ వార్తలు

ఏపీ సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజున ఆ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రక్త కేంద్రాల ఆధ్వరంలో 34,723 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర శాఖ ఛైర్మన్ డాక్టర్ ఎ.శ్రీధర్ రెడ్డి తెలిపారు. 13 జిల్లాల్లో 175 నియోజవర్గాల్లో 99 బ్లడ్ క్యాంప్​లు నిర్వహించినట్లు తెలిపారు.

redcroos-society-on-blood-camps
ఏపీ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా 34,723 యూనిట్ల రక్త సేకరణ

By

Published : Dec 22, 2020, 10:53 PM IST

ఆంధ్రప్రదేశ్​ సీఎం జగన్​ పుట్టినరోజు సందర్భంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్​ల ద్వారా 9,287 యూనిట్ల రక్త నిల్వలు సేకరించినట్లు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర శాఖ ఛైర్మన్ డాక్టర్ ఎ.శ్రీధర్ రెడ్డి తెలిపారు. సేకరించిన రక్త నిల్వలు లక్ష మందికి ఉపయోగపడతాయన్నారు.

కరోనా కారణంగా రాష్ట్రవ్యాప్తంగా రక్తనిల్వలు పడిపోయాయని శ్రీధర్​ పేర్కొన్నారు. బ్లడ్ క్యాంప్ ద్వారా రక్తం సేకరించటంతో రక్త నిల్వలు పెరిగాయని తెలిపారు. రక్త కొరత ఉన్న తమిళనాడు, బెంగళూరు, తెలంగాణ రాష్ట్రాలకు సైతం సరఫరా చేస్తున్నామని తెలిపారు.

ఇదీ చదవండి:ముఖ్యమంత్రైనా.. కేంద్రమంత్రైనా.. కిషన్​ రెడ్డే: సోయం

ABOUT THE AUTHOR

...view details