తెలంగాణ

telangana

ETV Bharat / city

రాజీవ్​ని ఆదర్శంగా తీసుకోవాలి :ఉత్తమ్

హైదరాబాద్‌ సోమాజిగూడలో రాజీవ్‌గాంధీ 75వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజీవ్ గాంధీ సద్భావనా ర్యాలీ నిర్వహించగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.

By

Published : Aug 20, 2019, 11:21 AM IST

రాజీవ్​ని ఆదర్శంగా తీసుకోవాలి :ఉత్తమ్

రాజీవ్​గాంధీ 75వ జయంతి వేడుకల్ని కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించింది. రాజీవ్ గాంధీ సద్భావనా పేరుతో మహాత్మా గాంధీ విగ్రహం నుంచి సోమాజిగూడ రాజీవ్​గాంధీ విగ్రహం వరకు ర్యాలీని చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. సోమాజిగూడలోని రాజీవ్‌ విగ్రహానికి పీసీసీ చీఫ్ ఉత్తమ్‌, పొన్నం ప్రభాకర్‌, షబ్బీర్‌ అలీ, వీహెచ్‌ పలువురు సీనియర్ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. రాజీవ్​గాంధీ దేశంలో సమాచార సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని పొన్నాల కొనియాడారు. రాజీవ్ ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని ఉత్తమ్ పేర్కొన్నారు.

రాజీవ్​ని ఆదర్శంగా తీసుకోవాలి :ఉత్తమ్

ABOUT THE AUTHOR

...view details