తెలంగాణ

telangana

ETV Bharat / city

నైరుతి ఎఫెక్ట్​: ఏపీలో విస్తారంగా వర్షాలు - krishna latest news

నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని కృష్ణా, కర్నూలు జిల్లాల్లో శనివారం రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంట పొలాల్లో నీరు నిలిచింది.

rains in andhra pradesh
ఏపీలో విస్తారంగా వర్షాలు

By

Published : Jun 27, 2021, 5:28 PM IST

నైరుతి రుతుపనాల ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాల్లో కనబడుతోంది. శనివారం రాత్రి నుంచి రెండు రాష్ట్రాల్లో భారీగా వర్షం కురుస్తోంది. ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. పలు చోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పెంచికలపాడు వద్ద వక్కలేరు వాగు పొంగిపొర్లడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నందవరం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలోకి వరద నీరు ప్రవేశించింది. పెద్దకొత్తిలిలో పంట పొలాలు నీట మునిగాయి. కోడుమూరు మండలం వర్కూరు వద్ద తుమ్మలవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మార్గమధ్యలో ఓ లారీ డ్రైవర్​ వాగులో చిక్కుకుపోయాడు. అతనిని స్థానికులు కాపాడారు.

కృష్ణా జిల్లాలో..

మోపిదేవి మండలం, కోసురువారిపాలెం, నాగాయతిప్ప, మెల్లమర్తిలంక, బొబ్బర్లంక, మోపిదేవి గ్రామాల్లో తెల్లవారుజామున 5 గంటల నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. దీంతో పంట పొలాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. భారీ వానలకు తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన చెందారు.

ఏపీలో విస్తారంగా వర్షాలు

ఇదీ చదవండి:Anjan kumar: తెలంగాణ వద్దన్న వాళ్లే ఇప్పుడు మంత్రులయ్యారు: అంజన్​ కుమార్ యాదవ్​

ABOUT THE AUTHOR

...view details