ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న విద్యావాలంటీర్లను రెన్యువల్ చేసి.. 14 నెలల బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. వీవీలపై రాష్ట్ర ప్రభుత్వం వివక్షతను ప్రదర్శిస్తోందని ఆరోపిస్తూ.. హైదరాబాద్ బషీర్బాగ్లోని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయాన్ని ముట్టడించారు.
మెండి వైఖరి ప్రదర్శిస్తున్నారు
విద్యావాలంటీర్ల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లకుండా విద్యాశాఖ అధికారులు మొండి వైఖరిని ప్రదర్శిస్తున్నారని ఆర్. కృష్ణయ్య ఆరోపించారు. కరోనా కారణంగా ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న 2 లక్షల 20 వేల మంది ఉపాధ్యాయులకు నెలకు రెండు రూ. 2వేలు, 25 కిలోల బియ్యం ఇస్తున్నట్లుగానే... 16 వేల మంది వీవీలకు కూడా సర్కారు సాయం అందించాలని డిమాండ్ చేశారు.