ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా మన్యంలో ఓ భారీ కొండచిలువ స్వేచ్ఛగా విహరిస్తూ స్థానికుల కనిపించింది. రాజవొమ్మంగి మండలం దూసరపాము నుంచి లబ్బర్తి వెళ్లే రహదారిలో చిట్రోలుబోదు కాల్వ వద్ద కొండచిలువ చిమ్మచీకట్లో సంచరిస్తోంది.
నీటిలో చక్కర్లు కొట్టిన కొండచిలువ.. ఆ దృశ్యాలు అదరహో... - python in chitrolubodu
ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా మన్యంలో ఓ భారీ కొండచిలువ నీటిలో ఈదుతూ కనిపించింది. ఆ ప్రాంతంలోని రోడ్డుపై వెళ్తున్న వారు.. ఆసక్తిగా తిలకిస్తూ చరవాణుల్లో బంధించారు.
నీటిలో చక్కర్లు కొట్టిన కొండచిలువ..ఆ దృశ్యాలు చుద్దామా
దారినవెళ్లే వారు సెల్ఫోన్లో ఆ దృశ్యాలను చిత్రీకరించారు. నీటిలోనూ ఆ భారీ కొండచిలువ ఈదుకుంటూ వెళ్తోంది. రాజవొమ్మంగి మండలంలో అప్పుడప్పుడు కొండచిలువలు హడావిడి చేస్తున్నాయి. ఇలా అప్పుడప్పుడు కొండచిలువలు జనావాసాల్లోనూ దర్శనమివ్వడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.
ఇదీ చూడండి :సీఎం ఎప్పుడు ప్రగతిభవన్ వస్తారో ఆయనకే తెలియదు: విజయశాంతి