తెలంగాణ

telangana

ETV Bharat / city

ధైర్యంగా ఉన్నా... దయ చూపని కరోనా! - పైడికొండల మాణిక్యాలరావు చివరి వీడియో వార్తలు

ఏపీ మాజీ మంత్రి, భాజపా నేత పైడికొండల మాణిక్యాలరావు(59) కన్నుమూశారు. కొద్దిరోజులుగా కరోనాతో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. తన ఆరోగ్య పరిస్థితిపై కొన్ని రోజుల క్రితం ఆయన విడుదల చేసిన వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది. అందులో ఏముందంటే....?

manikyalarao
manikyalarao

By

Published : Aug 1, 2020, 6:02 PM IST

'నా ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వదంతులు ఎవరూ నమ్మవద్దు. కంగారు పడవద్దు... అధైర్య పడవద్దు. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. భగవంతుని ఆశీస్సులతో, మీ అందరి ఆదరాభిమానాలతో నేను పరిపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తాను' తన ఆరోగ్యంపై కార్యకర్తల కోసం ఏపీ మాజీ మంత్రి, రాష్ట్ర భాజపా సీనియర్ నేత పైడికొండల మాణిక్యాలరావు చేసిన చివరి ట్వీట్ ఇది.

ధైర్యంగా ఉన్నా... దయ చూపని కరోనా!

కరోనా సోకినప్పటికీ మాణిక్యాలరావు ధైర్యం సడలిపోలేదు. కరోనాతో అందరూ అప్రమత్తంగా ఉండాలని ఇటీవల ఓ వీడియోలో ప్రజలకు జాగ్రత్తలు కూడా చెప్పారు. కానీ అదే ఆయన చివరి వీడియో అయింది. విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు.

పైడికొండల మాణిక్యాలరావుకు ఆయన మిత్రుడి ద్వారా 20 రోజుల కిందట కరోనా సోకింది. పాజిటివ్​గా నిర్ధరణ అయిన వెంటనే ఆయన కొవిడ్​ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్వీయ వీడియోను విడుదల చేశారు. అనుమానం వస్తే పరీక్షలు చేయించుకోవాలని వీడియో ద్వారా ప్రజలకు సూచించారు. కనీస జాగ్రత్తలు పాటించాలని కోరారు. కొవిడ్​తో భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. కానీ కరోనాతో పోరాటంలో ఆయన ఓడిపోయారు. ఇది వరకే ఆయనకు హై బీపీ, ఛాతి సమస్యలు ఉన్నాయి. కరోనా సోకటంతో ఆయన ఆరోగ్యం క్షీణించి కన్నుమూశారు.

ఇదీ చదవండి:కరోనాతో ఏపీ మాజీ మంత్రి మాణిక్యాలరావు కన్నుమూత

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details