మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున జరపాలన్న నిర్ణయాన్ని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి, పీవీ మనమడు ఎన్వీ సుభాష్ స్వాగతించారు. ఆర్థిక సంస్కరణలను దేశంలో ప్రవేశ పెట్టిన ఘనత ఆయనకు దక్కుతుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశంలో సంస్కరణలకు పీవీ నరసింహారావు ఆధ్యులని అన్నారు. దేశాన్ని ప్రగతి పథంలో నడిపించిన గొప్ప దార్శనికుడని కొనియాడారు.
కేసీఆర్ డిమాండ్పై పీవీ మనమడు, భాజపా నేత ఎలా స్పందించారంటే? - పీవీ శతజయంతి ఉత్సవాలపై ఆయన మనవడి స్పందన
దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చిన ఘనత పీవీ నరసింహరావని... భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి, పీవీ మనమడు సుభాష్ తెలిపారు. దేశం ఆర్థికంగా పతనమైన దశలో ప్రధానిగా పీవీ చేపట్టిన సంస్కరణలను గుర్తు చేశారు. పీవీ శత జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున జరపాలన్న నిర్ణయాన్ని స్వాగతించారు. భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు.

pv narasimha rao
పీవీకి భారతరత్న ఇవ్వాలని తాము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నట్లు సుభాష్ గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు తెలంగాణకు ఎనలేని సేవలు చేశారని సుభాష్ పేర్కొన్నారు. భూ సంస్కరణలు, విద్యారంగంలో కీలక సంస్కరణలు , రెసిడెన్సియల్ పాఠశాల విద్యావిధానాలకు మూలమని వెల్లడించారు.
ఇదీ చదవండి:ఏడాది పాటు పీవీ శత జయంతి ఉత్సవాలు: కేసీఆర్
TAGGED:
పీవీ శతజయంతి ఉత్సవాల వార్తలు