విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణపై.. ఏపీలో నిరసనలు వెల్లువెత్తాయి. కేంద్రం నిర్ణయాన్ని పార్టీలకతీతంగా నేతలంతా.. తీవ్రంగా వ్యతిరేకించారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై... మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత కూడా.. రాష్ట్ర నేతల్లో కనీస పోరాట స్ఫూర్తి లేకపోవడం చూస్తే తెలుగు వారిలో చేవ చచ్చిందా అనే అనుమానం కలుగుతుందని ఆవేదన వెలిబుచ్చారు.
జగన్ ఎందుకు మాట్లాడటం లేదు
ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను అడ్డుకోవాలంటూ...తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్... ముఖ్యమంత్రి జగన్కి లేఖ రాశారు. 28 మంది వైకాపా ఎంపీలు దిల్లీలో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఛత్తీస్గఢ్లోని నాగర్నార్ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ తెరపైకి వస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసేందుకు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిందన్న లోకేశ్... విశాఖ స్టీల్ప్లాంట్ అంశంలోనూ రాష్ట్ర ప్రభుత్వం అదే విధంగా చేయాలని డిమాండ్ చేశారు. అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో విజయవాడలో కేంద్ర బడ్జెట్పై రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్రం ప్రైవేటీకరణ చేస్తామన్నా..సీఎం జగన్ ఎందుకు మాట్లాడలేక పోతున్నారని...భేటీలో పాల్గొన్న నేతలు నిలదీశారు.
భూములను విక్రయించేందుకే