తెలంగాణ

telangana

ETV Bharat / city

పెనుకొండ ఆస్పత్రి ఎదుట ప్రజాసంఘాల ఆందోళన.. ఉద్రిక్తత

B Pharmacy Student Death Case: బీఫార్మసీ విద్యార్థిని అనుమానాస్పద మృతిపై ఏపీ పెనుకొండ ఆస్పత్రి వద్ద తెలుగుదేశం, వాల్మీకి సంఘం నాయకులు ఆందోళనకు దిగారు. ఎస్పీ రాహుల్‌దేవ్ సింగ్‌ వాహనాన్ని అడ్డుకున్నారు. వరుస దారుణాలు జరుగుతున్నా పోలీసులు అడ్డుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

By

Published : May 6, 2022, 4:25 PM IST

protest at penukonda hospital
protest at penukonda hospital

పెనుకొండ ఆస్పత్రి ఎదుట ప్రజాసంఘాల ఆందోళన.. ఉద్రిక్తత

B Pharmacy Student Death Case: ఏపీ శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ ఆస్పత్రి ఎదుట ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బీఫార్మసీ విద్యార్థిని తేజస్విని అనుమానాస్పద మృతిపై తెదేపా నేతలు, వాల్మీకి సంఘ నాయకులు ఆందోళన చేపట్టారు. ఎస్పీ రాహుల్‌ దేవ్‌ సింగ్‌ వాహనాన్ని అడ్డుకొని రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు, వాల్మీకి సంఘాల నేతల మధ్య తోపులాట జరిగింది. యువతి కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ వాల్మీకి సంఘాల నేతలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. న్యాయం చేస్తామని ఎస్పీ హామీ ఇవ్వడంతో నిరసనకారులు వెనక్కి తగ్గారు.

అసలేం జరిగిందంటే.. :తిరుపతిలో బీ.ఫార్మసీ మూడో సంవత్సరం చదువుతున్న యువతి తేజస్విని శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలం మల్లాపల్లిలోని ఓ వ్యవసాయ పొలంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ప్రియుడుగా చెబుతున్న సాదిక్​కు సంబంధించిన వ్యవసాయ షెడ్డులో ఉరి వేసుకొని చనిపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటన జరిగిన 24 గంటల తర్వాత ఆమె మరణవార్త వెలుగుచూసింది. యువతి తల్లిదండ్రులు మాత్రం ప్రేమ పేరుతో నమ్మించి తమ బిడ్డను హత్య చేశారని ఆరోపించారు. మాయమాటలతో తిరుపతి కాలేజీ నుంచి గుట్టుచప్పుడు కాకుండా తన సొంత వ్యవసాయ పొలంలోని షెడ్డుకు పిలిపించి.. హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని అన్నారు.

సమాచారం తెలుసుకున్న గోరంట్ల పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని తలుపులు పగల కొట్టి మృతదేహాన్ని బయటికి తీశారు. కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం.. గోరంట్ల పోలీస్ స్టేషన్ ఎదుట మృతదేహంతో మహిళలు పెద్ద సంఖ్యలో రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించి.. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

మరోసారి శవపరీక్ష:తేజస్విని మృతదేహానికి పెనుగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో రీ-పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు ధర్మవరం డీఎస్పీ రమాకాంత్‌ తెలిపారు. తేజస్విని గురువారం ఉరి వేసుకుని మృతి చెందింది. అయితే విద్యార్థిని మృతి పట్ల కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేయటంతో... రీ-పోస్టుమార్టం చేయిస్తున్నామని డీఎస్పీ వెల్లడించారు. మొదట చేసిన పోస్టుమార్టం రిపోర్ట్‌లో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసిందని పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా తేజస్విని ప్రియుడు సాదిక్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని చెప్పారు. రీ-పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు చేపడతామని డీఎస్పీ తెలిపారు.

ఇదీ చదవండి:పెళ్లి కోసం ప్రేయసి పక్కా ప్లాన్​.. ప్రియుడి కండోమ్​కు రంధ్రాలు.. చివరకు...

ఖబడ్దార్‌... పిచ్చిపిచ్చిగా మాట్లాడితే నాలుక చీరేస్తాం బిడ్డా.. : శ్రీనివాస్‌ గౌడ్‌

ABOUT THE AUTHOR

...view details